లస్కర్ల నియామకానికి అడుగులు
నీటి పొదుపు పాటిస్తే.. ఆయకట్టు పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏలు)ను క్రమబద్ధీకరించి వారిని నీటిపారుదల శాఖకు బదలాయించాని నిర్ణయించింది.
నెట్టెంపాడు ఉపకాల్వలో పారుతున్న నీరు
గద్వాల, న్యూస్టుడే: నీటి పొదుపు పాటిస్తే.. ఆయకట్టు పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏలు)ను క్రమబద్ధీకరించి వారిని నీటిపారుదల శాఖకు బదలాయించాని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలను నీటిపారుదల శాఖకు బదలాయించనున్నారు. సాగునీటి శాఖలో డివిజన్లు, సర్కిళ్ల వారీగా అవసరమైన సిబ్బంది సంఖ్యను గుర్తించి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ఈఎన్సీ నుంచి సూచనప్రాయంగా జిల్లా సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం
జిల్లాలో నెట్టెంపాడు, జూరాల, ఆర్డీఎస్, ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 3.27 లక్షల ఎకరాల వరకు సాగు ఆయకట్టు ఉంది. పూర్తి స్థాయిలో నీటిని చివరి ఆయకట్టు వరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిస్ట్రిబ్యూటరీల వద్ద నీటి వృథా, ఆధునికీకరణ లేక కాల్వలు శిథిలావస్థకు చేరటం, నీటిని ఆయకట్టుకు వదిలే క్రమంలో అవసరం కంటే రైతులు ఎక్కువగా నీటిని తూముల నుంచి తరలించుకోవటం వంటి సమస్యలతో ఏటా చివరి ఆయకట్టుకు కటకట ఏర్పడుతోంది. చెరువుల కింద అదే పరిస్థితి ఉంది. ప్రధాన చెరువుల తూముల నుంచి పంటలకు నీటి విడుదల పర్యవేక్షణకు సిబ్బంది లేక రైతులు ఇష్టానుసారంగా వృథా చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ప్రతి 50 ఎకరాలకు పైగా ఉన్న ప్రతి పది చెరువులకు ఒక లస్కర్ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పునర్వ్యవస్థీకరణపై త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సాగునీటి శాఖ వర్గాలు తెలిపాయి.
జిల్లాలో 440 మంది వీఆర్ఏలు
జోగులాంబ గద్వాల జిల్లాలో 440 మంది వరకు వీఆర్ఏలు ఉన్నారు. వారిలో కొంత మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. సాగునీటి శాఖ అవసరాల మేరకు ఇంటర్లోపు విద్యాభ్యాసం చేసిన వీఆర్ఏలను గుర్తించి సాగునీటిశాఖకు బదలాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జోగులాంబ జిల్లాలో ఇంటర్ లోపు చదివిన వీఆర్ఏలు 288 మంది వరకు ఉన్నట్లు అధికారిక సమాచారం. మిగిలిన వారిని ఇతర శాఖలకు జూనియర్ అస్టిటెంట్ క్యాడర్కు బదలాయించే అవకాశం ఉంది.
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం: జిల్లా ప్రాజెక్టుల పరిధిలో అవసరం ఉన్న లస్కర్లు, హెల్పర్ సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల వారీగా అవసరమున్న సిబ్బంది వివరాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో 194 మంది లస్కర్, 85 మంది హెల్పర్లు అవసరం ఉంది.
శ్రీనివాసరావు, జిల్లా ప్రాజెక్టుల ఎస్ఈ, జోగులాంబ గద్వాల జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
[ 19-04-2024]
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు