గుణపాఠం నేర్వాల్సిందే!
ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే బల్లార్ష- కాజీపేట రైల్వే మార్గంలో భద్రత చర్యలు సమీక్షించాల్సిన అవసరం ఉంది.
మూడో రైల్వేలైను పనుల వేళ అప్రమత్తత అవసరం
వంజీరి వద్ద జరుగుతున్న మూడో రైల్వే లైన్ కల్వర్టు పనులు
కాగజ్నగర్, న్యూస్టుడే: ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లాలో జరిగిన ప్రమాదం నుంచి గుణపాఠాలు నేర్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే బల్లార్ష- కాజీపేట రైల్వే మార్గంలో భద్రత చర్యలు సమీక్షించాల్సిన అవసరం ఉంది. సిగ్నల్స్లో ఎలాంటి లోపాలు, మూడో రైల్వేలైన్ పనుల్లో భాగంగా కల్వర్టుల వద్ద జరుగుతున్న నిర్మాణాలపై అప్రమత్తంగా ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని పలు రైలు ప్రమాదాలు జరిగాయి. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించగా.. మిగతా ప్రమాదాల్లో రైల్వేశాఖకు తీరని నష్టం జరిగింది. ప్రస్తుతం బల్లార్ష- కాజీపేట వరకు 226 కిలోమీటర్ల వరకు మూడో రైల్వేలైను పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కాగజ్నగర్ రైల్వేస్టేషన్ పరిధిలోని వంజీరి రైల్వే గేటు స్థానంలో రూ.6 కోట్ల వ్యయంతో అండర్బ్రిడ్జి పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
గతంలో జరిగిన ఘటనలు
* బల్లార్ష- కాజీపేట మార్గంలో కాగజ్నగర్ పెద్దవాగు సమీపంలోని రాళ్లపేట రైల్వేస్టేషన్ వద్ద 1981 సంవత్సరంలో తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆ ఘటనలో దాదాపు వందకుపైగానే ప్రయాణికులు మృతిచెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
* 1992 సంవత్సరంలో సిర్పూర్(టి)- బల్లార్ష రైల్వేస్టేషన్ మధ్యలోని రైల్వే కల్వర్టును మావోయిస్టులు బాంబుతో పేల్చడంతో దక్షిణ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ రైలులో అప్పటి నెల్లూరు ఎంపీ పసుల చెంచలయ్య(కాంగ్రెస్) ప్రయాణిస్తున్నారు. త్రుటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
* 1999లో కురిసిన భారీ వర్షాలకు రెబ్బెన రైల్వేస్టేషన్ సమీపంలోని వాగుపై రైల్వే వంతెన ఒక పిల్లర్ కొట్టుకుపోగా.. కాగజ్నగర్- హైదరాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వారంరోజుల పాటు రైలు రాకపోకలు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాంసి సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
అదిలాబాద్ జిల్లా తాంసిలోని సీఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రార్థన మందిరంలో క్రైస్తవులంతా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
మతతత్వంతో లబ్ధి పొందే పార్టీలకు బుద్ధి చెప్పాలి
[ 29-03-2024]
మతతత్వం రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే పార్టీలకు రానున్న లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. -
అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు తప్పవు
[ 29-03-2024]
అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ స్టేషన్ ఎక్సైజ్ సీఐ విజేందర్ హెచ్చరించారు. -
తేలిన బరి.. గెలుపుపై గురి
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భాజపా అభ్యర్థిగా గోడం నగేష్, భారాస తరఫున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. -
ఇక విద్యుత్తు కోతలకు చెక్
[ 29-03-2024]
ఎండలు ఎక్కువ కావడంతో విద్యుత్తు వినియోగం పెరిగిపోయింది. దీంతో కొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. వచ్చే రెండు నెలల్లో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశం... -
ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి
[ 29-03-2024]
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మరోసారి ఆరోపించారు. -
పెన్గంగా.. ఇసుకదందా
[ 29-03-2024]
మండలవాసులకు వరప్రదాయినిగా ఉన్న పెన్గంగా నదిలో ఇసుకదొంగలు పడ్డారు. పారే నీటిని ఆపిమరీ యంత్రాలతో ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. -
గడువు ముందర సందిగ్ధం!
[ 29-03-2024]
ఏటా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి, ప్రభుత్వ పనులకు బడ్జెట్ కేటాయిస్తారు. దానిని ఆ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తే.. వారు ఈ-కుబేర్లో నమోదు చేస్తారు. -
ఆన్లైన్ జూదంలో నష్టపోయి.. రైతుల డబ్బు కాజేత
[ 29-03-2024]
ఆదిలాబాద్ ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ విజయ్ జాదవ్ ఆన్లైన్ జూదానికి అలవాటు పడి అందులో నష్టపోయి రైతులకు చెందిన డబ్బులను కాజేసినట్లు తెలుస్తోంది. -
బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 29-03-2024]
రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. -
సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి ఆదేశించి
[ 29-03-2024]
గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం అదనపు పాలనాధికారి దీపక్ తివారీతో కలసి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. -
ఉద్యానవనాలపై ఉదాసీనత..
[ 29-03-2024]
మంచిర్యాల పట్టణవాసులకు ఆహ్లాదం కోసం వివిధ వార్డుల్లో ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఉద్యానవనానికి రూ.40 లక్షల నుంచి రూ.90 లక్షలు కేటాయించారు. -
రూ.‘కోటి’.. చీకటి పాలు
[ 29-03-2024]
ఒకవైపు రహదారి విస్తరణ లేక, మరోవైపు సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం)కు నిత్యం ముడిసరకు లారీల రాకపోకల కారణంగా.. ఏడాదిలోపే రూ.కోటితో ఏర్పాటు చేసిన వెలుగులు విరజిమ్మే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ చీకటి పాలవుతోంది. -
‘టీజీ’ కోడ్తో రిజిస్ట్రేషన్లు
[ 29-03-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. -
పట్టణ వనాలపై పట్టింపు శూన్యం
[ 29-03-2024]
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. -
ఆత్మహత్యలతో రెండు కుటుంబాల్లో విషాదం
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో నిజామాబాద్ పట్టణానికి చెందిన యువతి, యువకుడు బుధవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
సాగులో సాంకేతికత.. మహిళలకు సాధికారత
[ 29-03-2024]
వ్యవసాయరంగంలో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ యోజనను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ప్రయోగాత్మకంగా కొంత మంది యువతీ యువకులను ఎంపిక చేసి డ్రోన్ నిర్వహణ, -
ఈత కారాదు గుండెకోత
[ 29-03-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. -
ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ
[ 29-03-2024]
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!