తెలంగాణ దేశానికే ఆదర్శం
తెలంగాణలో ఉన్నది నూటికి నూరుపాళ్లు రైతు రాజ్యమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తిమ్మాజిపేటలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.
తిమ్మాజిపేట రైతు వేదికలో మాట్లాడుతున్న నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
తిమ్మాజిపేట, న్యూస్టుడే : తెలంగాణలో ఉన్నది నూటికి నూరుపాళ్లు రైతు రాజ్యమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తిమ్మాజిపేటలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. రైతు బంధు, బీమా వంటి పథకాలు కేంద్ర పాలకుల కళ్లు తెరిపించాయన్నారు. తెలంగాణాలో పంటల సిరులు కురిపించేలా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. పాత, కొత్త రోజులను గుర్తుచేసుకోవాలని రైతులను కోరారు. అంతకుముందు తిమ్మాజిపేటలో ఎడ్ల బండ్లతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. పోతిరెడ్డిపల్లి, గుమ్మకొండ, మారేపల్లి గ్రామాల రైతు వేదికల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ రవీందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు దయాకర్రెడ్డి, సర్పంచులు గోపిగౌడ్, హర్యానాయక్, హుని, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి అండగా భారాస ప్రభుత్వం
నాగర్కర్నూల్ : వ్యవసాయానికి భారాస ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో రైతు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రైతుకు పెట్టుబడి కింద ఎకరానికి రూ.10వేలు సాయం చేయటం, రైతు బీమా అందిస్తుందన్నారు. కేసీఆర్ రైతు పక్షపాతిగా ఉంటు రైతులకు అండగా ఉంటున్నారని తెలిపారు. రైతు వేదికల నిర్మాణం, ఏఈవోల నియామకం, రైతులకు కరెంటు కోతలు లేకుండా చేయటం, 24 గంటల పాటు ఉచిత కరెంటును అమలు చేస్తున్నారన్నారు. గతంలో వ్యవసాయం దండగ అని చెప్పిన రోజుల నుంచి ఇప్పుడు పండుగ వాతవరణం తీసుకొచ్చారన్నారు. కేఎల్ఐతో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో బీడు బీములు సస్యశ్యామలం అయ్యాయన్నారు.
అచ్చంపేట న్యూటౌన్ : రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్కపల్లిలో రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి విప్ గువ్వల భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఎద్దుల బండిపై ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతుబంధు, రాయితీ పై ఎరువులు, విత్తనాలను అందజేస్తోందన్నారు. పుర ఛైర్మన్ నర్సింహగౌడ్, మార్కెట్ ఛైర్మన్ అరుణ, ఎంపీపీ అరుణ, ఎడిఎ చంద్రశేఖర్, ఎవో కృష్ణయ్య, నేతలు మనోహర్, రాజేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పకడ్బందీగా సార్వత్రిక పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్య పీఠం(ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఇందిర తెలిపారు. -
ఇంటర్ ఫలితాల్లో 62.82 శాతం ఉత్తీర్ణత
[ 24-04-2024]
ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. -
ఆలయ మండపానికి భూమి పూజ
[ 24-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించేందుకు శ్రీ భ్రమరాంబిక అడిగేశ్వర స్వామి ఆలయ మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం