సంపద సృష్టించే అన్నదాతను గౌరవించాలి
ఎక్కువగా కష్టపడేది, సంపదను సృష్టించేది అన్నదాత అని.. అందరికంటే ఎక్కువగా వారినే గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రం శివారు నాగవరం రైతు వేదికలో ‘రైతు దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు.
రైతు దినోత్సవంలో మంత్రి నిరంజన్రెడ్డి
ఎడ్లబండిపై నాగారం రైతు వేదిక వద్దకు ఊరేగింపుగా వెళ్తున్న మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టరు తేజస్ నంద్లాల్ పవార్
వనపర్తి, న్యూస్టుడే : ఎక్కువగా కష్టపడేది, సంపదను సృష్టించేది అన్నదాత అని.. అందరికంటే ఎక్కువగా వారినే గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రం శివారు నాగవరం రైతు వేదికలో ‘రైతు దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని సంప్రదాయంగా కాకుండా పరిశ్రమగా గుర్తించి, ప్రపంచ పోకడలనెరిగి పండించిందే నిజమైన వ్యవసాయం, ఉపాధి అన్నారు. దేశంలో వ్యవసాయం పండగైందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటూ లాభసాటి పంటలు పండించుకోవాలని సూచించారు. ప్రపంచంలో అన్నిచోట్ల అన్ని పంటలు పండవని, ఒక్కో నేలలో ఒక్కో రకమైన పంటలు పండిస్తారని అన్నారు. ఈ దేశం, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులను అందించే వనరులు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పప్పుల ధరలు పెరిగిపోయాయని, నిల్వలు నిండుకున్నాయని.. అందుకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి పప్పులను దిగుమతి చేసుకోవడమే కారణమన్నారు. మనకు కావాల్సిన పంటలు వేసుకోవడం మీద దృష్టి పెట్టి లాభసాటి వ్యవసాయం చేస్తే అది తెలివైన పనిగా ఆయన పేర్కొన్నారు. తాను బతికినంత కాలం అన్నదాతల క్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. స్వభావరీత్యా వ్యవసాయాన్ని ప్రేమించే తనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించడం అదృష్టంగా భావిస్తానని పేర్కొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయనాలు కాకుండా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి సమాజానికి మంచి ఉత్పత్తులను అందించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, జిల్లా పరిషత్తు ఛైర్మన్ లోక్నాథ్రెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షుడు గట్టు యాదవ్, ఉపాధ్యక్షుడు వాకిటి శ్రీధర్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేష్గౌడ్, వ్యవసాయ, ఉద్యాన, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎడ్లబండ్ల ఊరేగింపు..
జిల్లా కేంద్రం శివారులోని ఆర్టీవో కార్యాలయం నుంచి నాగారం రైతు వేదిక వరకు ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ ఎడ్లబండిపై రైతు ఉత్సవానికి వచ్చారు. ఊరేగింపులో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సభ అనంతరం రైతులతో కలిసి మంత్రి, అధికారులు సహపంక్తి భోజనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పకడ్బందీగా సార్వత్రిక పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్య పీఠం(ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఇందిర తెలిపారు. -
ఇంటర్ ఫలితాల్లో 62.82 శాతం ఉత్తీర్ణత
[ 24-04-2024]
ఇంటర్మీడియట్ జనరల్ విభాగం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. -
ఆలయ మండపానికి భూమి పూజ
[ 24-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో ఉత్సవాలు నిర్వహించేందుకు శ్రీ భ్రమరాంబిక అడిగేశ్వర స్వామి ఆలయ మండపానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
దిగులుపడకు మిత్రమా
[ 24-04-2024]
పది, ఇంటర్మీడియట్లకు మించిన పరీక్ష జీవితం.. పరీక్షల్లో తప్పితే ఓడినట్లు కాదు.. ఇవే జీవితాన్ని శాసించేవి కావు... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకునే విద్యార్థే అసలైన విజేత. -
లింగ నిర్ధారణపై నియంత్రణేదీ?
[ 24-04-2024]
నాగర్కర్నూల్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ మహిళా పీఎంపీ అబార్షన్ చేయగా గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు చేశారు. -
వందరోజుల్లో కాంగ్రెస్పై భ్రమలు తొలగాయి
[ 24-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న భ్రమలు వందరోజుల్లోనే తొలగిపోయాయని భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు
[ 24-04-2024]
ఈ విద్యా సంవత్సరం (2023-24) మంగళవారంతో ముగిసింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ ప్రగతి పత్రాలు అందజేశారు. -
పనితీరు మారకుంటే చర్యలు : కలెక్టర్
[ 24-04-2024]
అధికారుల పనితీరు మెరుగు పర్చుకోకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో సర్ఫ్ కార్యక్రమాలపై డీపీఎంలు, సీసీలతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. -
దశాబ్దాలుగా కాలినడకనే ప్రయాణం
[ 24-04-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చెన్నూరు గ్రామస్థులు బస్సు సౌకర్యానికి నోచుకోవడం లేదు. గ్రామానికి మూడు బీటీరోడ్లు ఉన్నా అక్కడికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. -
బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
[ 24-04-2024]
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. -
లెక్క తప్పితే పదవికి గండమే
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థులు నామినేషన్ల వేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుండగా మరికొందరు ఎన్నికల ఖర్చు లెక్కచూపాల్సిఉండటంతో సాదాసీదాగా ఐదుగురితో వెళ్లి వేసి వస్తున్నారు. -
రేపటి నుంచి ‘సార్వత్రిక’ పరీక్షలు
[ 24-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) 2023-24 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
పరుగులో చిరుత
[ 24-04-2024]
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ -
‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
[ 24-04-2024]
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. -
గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
[ 24-04-2024]
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. -
26న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
[ 24-04-2024]
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం : ఎంపీ
[ 24-04-2024]
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!