పాలమూరు బంగారు తునక
పాలమూరులో గంజి కేంద్రాలు పోయాయని, పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాలొచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు ముంబయి బస్సులకు కేంద్రంగా పాలమూరు జిల్లా ఉండేదని, ఎక్కడ చూసినా గంజి కేంద్రాలే కనిపించేవన్నారు.
గంజి కేంద్రాలు పోయి.. ధాన్యం కేంద్రాలొచ్చాయి
నాగర్కర్నూల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, మహబూబ్నగర్- నాగర్కర్నూల్, కందనూలు, న్యూస్టుడే:
సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
పాలమూరులో గంజి కేంద్రాలు పోయాయని, పంటల ధాన్యం కొనుగోలు కేంద్రాలొచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు ముంబయి బస్సులకు కేంద్రంగా పాలమూరు జిల్లా ఉండేదని, ఎక్కడ చూసినా గంజి కేంద్రాలే కనిపించేవన్నారు. జలాశయాలకు నీరొస్తే పొలాలన్నీ పచ్చబడి పాలమూరు బంగారు తునక అవుతుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. భారాస జిల్లా పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదట మహబూబ్న్గర్కు, తర్వాత వనపర్తికి వైద్య కళాశాలలొచ్చాయన్నారు. తర్వాత నాగర్కర్నూల్కు ప్రత్యేక సందర్భంలో వైద్య కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఐదు జిల్లాలకు వైద్య కళాశాలలు వస్తాయని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఫలితం ఇదేనన్నారు.తెలంగాణ ఏర్పాటు వల్లే నాగర్కర్నూల్ జిల్లా అయ్యిందన్నారు. కొత్తగా ఏర్పాటైన కలెక్టరేట్, ఎసీ కార్యాలయాల వద్ద లైట్ల వెలుగులో పలువురు సెల్పీ దిగుతూ ఉన్న ఫొటోలు తన దృష్టికి వచ్చాయన్నారు. గతంలో ఈ జిల్లాలో పని చేసిన మంత్రులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు వస్తుందన్నారు. కాకతీయ రాజులు 75 చెరువులు, కుంటలు తవ్వరని, వాటన్నింటిని గతంలోనే ధ్వంసం చేశారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా ఈ జిల్లాలో చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా పాలెం, వట్టెం, కేసరి సముద్రం చెరువులు ఎంతో బాగుపడ్డాయన్నారు. కేసరి సముద్రం చెరువును ట్యాంక్బండ్గా అభివృద్ధి చేసి బుద్ధుడి విగ్రహాన్ని కూడా నెలకొల్పినట్లు చెప్పారు. ఒకప్పుడు దుందుభి చెరువు ఎండిపోయి ఉండేదని, ఇప్పుడు చెక్ డ్యామ్లతో జలకళ సంతరించుకుందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పారు. 20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. అచ్చంపేటలో రూ.2వేల కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా బోరుబావులు కళకళలాడుతున్నాయన్నారు. ఉద్యమం సమయంలో నాలుగైదు చోట్ల పాలమూరు పరిస్థితి చూసి కన్నీరు వచ్చేదని, ఇప్పుడు అభివృద్ధి చూస్తే సంతోషంగా ఉందన్నారు. మహబూబ్నగర్లో 64 మండలాలను 76గా చేసుకున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 15 ఉంటే ఇప్పుడు 85కు చేరుకున్నాయన్నారు.
తెలంగాణ తల్లికి సీఎం పుష్పాభిషేకం
వంద శాతం పూర్తి చేస్తాం..: నూతన కలెక్టరేట్లో అధికారుల సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో ఏ పల్లెలు తెలంగాణ గ్రామాలకు సాటిరావన్నారు. ఏ సమాజమైనా ప్రగతి సాధించిందంటే మాతాశిశు మరణాల తగ్గుదల, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం చూస్తామన్నారు. వీటన్నింటిలో చాలామెరుగ్గా ఉన్నామన్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు.. తెలంగాణ చిరునవ్వులు చిందించేలా పని చేయాలన్నారు. గతంలో మహబూబ్నగర్లో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులే కనిపించేవన్నారు. ఇక్కడి చెరువులను చూసి గోరటి వెంకన్న అనేక కవితలు రాశారని గుర్తు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో అడవులు కూడా పలుచబడిపోయి కనిపించేవన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100 శాతం పూర్తి చేస్తామన్నారు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మహమ్మద్అలీ, ప్రశాంత్రెడ్డి, ఎంపీˆలు శ్రీనివాస్రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్యాదవ్, హర్షవర్దన్రెడ్డి, బాలరాజు, రామ్మోహన్రెడ్డి, అబ్రహం, కృష్ణమోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, దామోదర్రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద రిబ్బన్ కత్తిరిస్తున్న ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి
కార్యాలయాల ప్రారంభం ఇలా..
నాగర్కర్నూల్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు హెలీప్యాడ్లో కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బస్సులో భారాస కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజును కుర్చిలో కుర్చోబెట్టారు. శాలువ కప్పి సన్మానించారు. అక్కడ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిసరాలను పరిశీలించారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎస్పీ మనోహర్ను కుర్చీలో కుర్చోబెట్టి శాలువా కప్పారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకున్నారు. అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించి లోపలికి వెళ్తుండగా ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డిని పిలిచి ఆయనతో రిబ్బన్ కట్ చేయించారు. జిల్లా వాసి కావడంతో ఆయనతో ఇలా చేయించారు. కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ఉదయ్కుమార్ను మూడుసార్లు లేపి కుర్చోబెట్టారు. కలెక్టర్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేయించారు. కలెక్టరేట్ను చక్కగా నిర్మించిన రోడ్డు భవనాల శాఖ అధికారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, మంత్రులు నిరంజన్రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, డీజీపీ అంజన్కుమార్లకు కలెక్టర్ ఉదయ్కుమార్ శాలువాలు కప్పి సన్మానం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు గ్రూపు ఫొటో దిగారు.
* రైతుల కష్టాలు తెలిసిన కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నారని విప్ గువ్వల బాలరాజు అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ ఓటుకు నోటుకు కేసులో జైలుకెళ్లి ఈ ప్రాంత పరువు తీసిన వ్యక్తి ఇప్పుడు బహిరంగ వేదికలపై సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అచ్చంపేట నియోజకవర్గ రైతులకు సాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించి పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు, నాయకులు సమర్థంగా పని చేయాలన్నారు.
* ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ప్రజలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో సీఎం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో రాజకీయ పదవులు అనుభవించిన నాయకులు అభివృద్ధి పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
కలెక్టర్ ఛాంబర్లో ఉదయ్కుమార్ను, ఎస్పీ కార్యాలయంలో మనోహర్ను కుర్చీల్లో కుర్చోబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీ రాములు, విప్ బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, జైపాల్యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్