పరిశ్రమల ఖిల్లాగా ఉమ్మడి జిల్లా
సమైక్య రాష్ట్రంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిశ్రమల ఖిల్లాగా మారుతోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ అర్బన్, న్యూస్టుడే : సమైక్య రాష్ట్రంలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిశ్రమల ఖిల్లాగా మారుతోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో మూసివేసిన పరిశ్రమలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహబూబ్నగర్కు దేశంలోనే అతి పెద్దదైన అమర రాజా లిథియం గిగా బ్యాటరీల ప్యాక్టరీ తీసుకొచ్చామన్నారు. దీని వల్ల 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. త్వరలో మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. గడిచిన 9 ఏళ్లల్లో మహబూబ్నగర్ జిల్లాలో 758 సూక్ష్మ, 15 చిన్న తరహా, 23 భారీ, 3 మెగా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటుచేశామన్నారు. టీఎస్ ఐపాస్, టీ-ఐడియా, టీ-ఫ్రైడ్, తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంతో కృషిచేస్తున్నారని తెలిపారు. పాలమూరులో అపారమైన వనరులు ఉన్నాయన్నారు. సూక్ష్మ, చిన్న, భారీ తరహా పరిశ్రమల్లో రాణిస్తున్న వారిని ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజరు బాబూరావు, గనులు, భూగర్భ శాఖ ఏడీ విజయ్కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు వెంకటేశ్, ఎన్ఐసీ డీఐవో ఎం.ఎస్.మూర్తి, లీడ్బ్యాంక్ మేనేజరు కల్వ భాస్కర్, కార్మికశాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, పారిశ్రామిక వేత్తలు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?