సాగుకు రైతులు సన్నద్ధం
జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల రైతులు పత్తి, జొన్న, మరి కొన్నిచోట్ల పచ్చిరొట్ట ఎరువులు, మొక్కజొన్న, వరి, కంది, పెసర, పత్తి విత్తనాలను విత్తుకుంటున్నారు.
జిల్లాలో మొదలైన విత్తనాలు, ఎరువుల విక్రయాలు
హన్వాడ : గుడిమల్కాపూర్ సమీపంలో ట్రాక్టర్తో జొన్న విత్తనం వేస్తున్న రైతులు
మహబూబ్నగర్ వ్యవసాయం, న్యూస్టుడే : జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల రైతులు పత్తి, జొన్న, మరి కొన్నిచోట్ల పచ్చిరొట్ట ఎరువులు, మొక్కజొన్న, వరి, కంది, పెసర, పత్తి విత్తనాలను విత్తుకుంటున్నారు. కొందరు రైతులు పెంట ఎరువులను చల్లుకుంటున్నారు. ఇప్పటికే వరికోతలు పూర్తికావటంతో పొలాల్లో చెత్తాచెదారం తొలగించి సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల, మిడ్జిల్, రాజాపూర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్, హన్వాడ తదితర మండలాల్లో తేలకపాటి వర్షాలు కురవటంతో రైతులు పొలం పనుల్లో మునిగారు.
* జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంలో 3,77,917 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 28,546 ఎకరాల్లో, పత్తి 1,15,845, వరి 1,89,917, జొన్న 13,015, కంది 12,548, ఆముదం 1565 ఎకరాల్లో సాగు చేయనున్నారని అంచనా వేస్తున్నారు. మందస్తుగా వ్యవసాయ శాఖ అధికారులు 95,305 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పుడు 18,328 మెట్రిక్ టన్నుల డీఏపీ, 32,990 మెట్రిక్ టన్నుల యూరియా, 9,164 టన్నుల ఎంవోపీ, 27,429 టన్నుల కాంప్లెక్స్, 7,331 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు ఉన్నాయి. వీటన్నింటిని రైతులకు సకాలంలో అందించనున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెఫెడ్ ద్వారా ఎరువులు విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా బండ్ల గిరక పోటీలు
[ 18-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో అన్నదాతలు ఎద్దుల బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నామపత్రాల సమర్పణకు వేళాయె
[ 18-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో గురువారం నుంచి నామపత్రాల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
వారసత్వంపై అలసత్వం
[ 18-04-2024]
రాష్ట్రంలోనే వారసత్వ సంపదకు పాలమూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. రాజుల కోటలు, ఆలయాలు, శిల్పకళలు, సంస్థానాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెట్టింది పేరు. -
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
[ 18-04-2024]
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
మయూరి ఉద్యానం.. భద్రత కనం
[ 18-04-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మయూరి పార్కులో పర్యాటకులకు భద్రత కరవైంది. -
తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
[ 18-04-2024]
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. -
ఐటీ కారిడార్ ఏర్పాటు.. ఉపాధి కల్పనకు కృషి
[ 18-04-2024]
నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలో ఐటీ కారిడార్, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం పట్టణానికి సమీపంలోని మార్కెట్యార్డు వద్ద భాజపా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. -
పార్కులో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
[ 18-04-2024]
మహబూబ్నగర్కు సమీపంలోని పార్కులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్ కథనం ప్రకారం.. -
నాయకా.. అభివృద్ధి పనుల్లో ఏదీ కదలిక?
[ 18-04-2024]
అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నాయకులు తామిచ్చిన వాగ్దానాలను కార్యరూపంలోకి తేవడంలో విఫలమవుతున్నారు. -
‘మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్’
[ 18-04-2024]
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాష్ట్రంలో మూడు ఎస్పీ రిజర్వుడు లోకసభ స్థానాల్లో ఒక్కటీ తమకు కేటాయించలేదని ఎమ్మార్పీస్ నాయకులు ధ్వజమెత్తారు. -
తనువు చాలించిన గర్భిణి
[ 18-04-2024]
ప్రసవానికి వచ్చిన ఓ నిండు గర్భిణి పరిస్థితి విషమించి జిల్లా ఆస్పత్రిలో మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. -
అంతా సీతారామం
[ 18-04-2024]
రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. -
దేశంలో రామరాజ్యానికి అడుగులు : డీకే అరుణ
[ 18-04-2024]
అయోధ్యలో రామాలయ నిర్మాణంతో దేశంలో రామరాజ్యానికి అడుగులు పడ్డాయని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్