బయట తిండితో జాగ్రత్త!
ఏ పని చేసినా జానెడు పొట్టకోసమే అంటుంటాం. ఆకలి తీర్చుకోవడానికైనా.. జీవించడానికైనా.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికైనా ఆహారం తీసుకుంటాం.
కరుచే కాదు.. శుచి, నాణ్యతా ముఖ్యమే
న్యూస్టుడే, పాలమూరు
ఏ పని చేసినా జానెడు పొట్టకోసమే అంటుంటాం. ఆకలి తీర్చుకోవడానికైనా.. జీవించడానికైనా.. జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికైనా ఆహారం తీసుకుంటాం. అలాగని ఏది పడితే తింటే మొదటికే మోసం అవుతుంది.. అనేక వ్యాధుల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవనంలో చాలామంది హోటళ్లల్లోనే టిఫిన్లు తింటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్తూ ఉద్యోగాలు చేసేవాళ్లకు హోటల్ భోజనాలు తప్పటం లేదు. కొందరు వారాంతాల్లో ప్రత్యేక వంటలు తినేందుకు కుటుంబంతో సహా హోటళ్లకు వెళ్తున్నారు. ఇక విద్యార్థులు, యువతీ యువకులు ఎక్కువగా బేకరీ ఆహార పదార్థాలు తింటున్నారు. చాలా వరకు బయటి తిండి నాసిరకం పదార్థాలతోనే తయారవుతోంది. ఏమీ ఆలోచించకుండా బయట తిండే తినుకుంటూ వెళ్తే ఆరోగ్య ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వస్తుంది. ‘ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం’ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
తినుబండారాలపై మక్కువ
మిఠాయిలు, చిరుతిండ్లపై ప్రజలు మక్కువ చూపిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు తాజావేనా.. ఎక్కువ రోజులు నిల్వ చేసినవా.. ఈగలు, దోమలు వాలుతున్నాయా.. దుమ్ము పడుతోందా? అనేది కూడా పట్టించుకోవటం లేదు. కొనుగోలు చేసి తీనేస్తున్నారు. కొందరు తీసుకొచ్చి చాలా రోజులు ఫ్రిజ్లో దాచుకుంటూ తింటున్నారు. ఇది చేయటం వల్ల ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. మిఠాయిలు, చిరుతండ్లు ఎక్కువగా అమ్ముడయ్యే, నాణ్యత పాటించే దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
హోటళ్లలో నిల్వ మాంసం
హోటళ్లల్లో అమ్ముడుపోని ఆహారాన్ని, చేపలు, చికెన్, మటన్, కూరలను చాలా రోజుల పాటు ఫ్రిజ్లలో నిల్వ చేస్తున్నారు. ఇలాంటి ఆహారంపై ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడుతాయి. నిల్వ పదార్థంగా గుర్తించనివిధంగా మసాలాలు వాడుతున్నారు. వీటిని తిన్నవారు అనారోగ్యం బారినపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆహార తనిఖీ అధికారుల కొరత ఉండటం, పురపాలికలు తనిఖీలు చేపట్టకపోవటంతో హోటళ్లలో ఆహారం నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. హోటళ్లలో మాంసాహార భోజనం చేసేవాళ్లు జాగ్రత్త తీసుకోవాలి.
గప్చిప్స్తో ప్రమాదం.. : ఎక్కువ మంది ఆహార ప్రియులకు గప్చిప్, పానీపూరీ, కట్లెట్ వంటివి ఇష్టం. విక్రయదారుల్లో చాలామంది నాణ్యత, పరిశుభ్రత పాటించటం లేదు. శుద్ధజలం వాడటం లేదు. రుచి కోసం కలిపే పదార్థాలు అనారోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. అయినా పట్టణాల్లో ఎగబడి తింటున్నారు. ఇలాంటి చోట్ల గప్చిప్లు వంటివి తినటం వల్ల లివర్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. పచ్చకామెర్లకు కూడా కారణమవుతున్నాయి. పిల్లలు వాంతులు, విరోచనాలతో పాటు టైఫాయిడ్ జ్వరం బారినపడే ప్రమాదముంది.
బేకరీ పదార్థాలపై దృష్టేదీ? : బ్రెడ్, కేకులు, బన్నులు, ఫిజ్జా, బర్గర్, చికెన్ రోల్స్ వంటి బేకరీ ఆహార పదార్థాలు తెప్పించుకుంటున్నారు. చాలా ఉత్పత్తులపై కాలపరిమితి తేదీలు ఉండటం లేదు. చాలామంది తేదీలను చూడకుండానే కొనుగోలు చేస్తున్నారు. గడువు తీరిన ఉత్పత్తులు తింటే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా వివాహాల క్యాటరింగ్ గుత్తేదారులు ఎవరికీ తెలియని పేర్లతో ఉండే నాణ్యత లేని ఐస్క్రీమ్లు సరఫరా చేస్తున్నారు. వాటిని తింటే ఇబ్బందులు పడక తప్పదు.
ఇంట్లో ఆహారమే ఉత్తమం.. : ఇంట్లో వండుకున్న ఆహార పదార్థాలే అన్నింటి కన్నా ఉత్తమం. హోటళ్లు, బేకరీల్లో నాణ్యత, శుభ్రత పాటించటం లేదు. ఎక్కువగా బయడి తిండి తినటం వల్ల అనేక వ్యాధులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లలో కాగిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతూ వడలు, పూరీలు, బోండాలు, బజ్జీలు తయారు చేస్తారు. వీటిని క్రమం తప్పకుండా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. ఇంట్లోనే టిఫిన్లను ఎక్కువ పోషకాలు, రుచిగా ఉండేలా భిన్నంగా చేసుకోవచ్చు. ఇడ్లీలను క్యారెట్ కలిపి తయారు చేసుకోవచ్చు. కూరగాయలు వేసుకొని ఉప్మా చేసుకోవచ్చు. కుటుంబ ఆరోగ్యం కోసం ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
శైలజ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పోషకాహార నిపుణురాలు, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల పర్వం.. శుభారంభం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావటంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. తొలిరోజైన గురువారం పూర్వ పాలమూరు పరిధి మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
శ్రీరాముడి పేరుతో నాయకుల మోసం
[ 19-04-2024]
దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా శ్రీరాముడి (దేవుని) పేరుతో మోసం చేస్తూ ఓట్ల కోసం వస్తున్న పార్టీలను, నాయకులను గుర్తించి వారితో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భారాస అభ్యర్థులకు బీఫాం అందజేత
[ 19-04-2024]
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం బీ-ఫాంలు అందజేశారు. -
స్మార్ట్ సిటీగా పాలమూరు అభివృద్ధి
[ 19-04-2024]
పాలమూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భాజపా మహబూబ్నగర్ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
అంగన్‘వేడి’
[ 19-04-2024]
రాజోలిలో ఓ గుడిసెలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రమిది. మండలంలో 37 కేంద్రాలుంటే కేవలం నాలుగింటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. 22 కేంద్రాలు ఇరుకైన గాలి వెలుతురు సక్రమంగా రాని అద్దె భవనాలు, రేకుల గుడిసెల్లో ఇదిగో ఇలా నిర్వహిస్తున్నారు. -
గెలుపు బాధ్యత కార్యకర్తలదే
[ 19-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి తనను ఎంపీగా గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ, నర్వ మండలాల్లో ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. -
బావాజీ తిరిగిన నేల.. పులకించనున్న వేళ
[ 19-04-2024]
అడవులలో నివసిస్తున్న బంజారాలకు జ్ఞానబోధన చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గురు లోకమసంద్ ప్రభు(బావాజీ)ని గిరిజనులు దైవంగా ఆరాధిస్తారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో గిరిజనులు బావాజీని అనుసరిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో అర్చకుడి మృతి
[ 19-04-2024]
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అర్చక యువకుడు మృతి చెందిన సంఘటన బిజినేపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్నగర్ పట్టణం వీరన్నపేటకు చెందిన బద్రీనాథ్ (24) వృత్తిరీత్యా పురోహితుడు. -
805 అడుగులకు చేరితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
[ 19-04-2024]
కృష్ణానదిలో శ్రీశైలం తిరుగుజలాలు గురువారం నాటికి 809 అడుగుల మేర నిల్వ ఉన్నాయి. 805 అడుగుల వరకు నీళ్లు తగ్గితే తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నారు. -
మోదీతోనే భారత్కు గుర్తింపు
[ 19-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్కు మంచి గుర్తింపు వచ్చిందని మరోమారు ఆయనను గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని భాజపా శాసనసభ పక్ష ఉపనేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు
[ 19-04-2024]
ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. -
తప్పుడు నివేదికలు ఇస్తే సహించం
[ 19-04-2024]
తప్పుడు నివేదికలు, లెక్కలు చూపితే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీహర్ష పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పేట మండలం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. -
నాకింత... నీకింత
[ 19-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?