ఎన్నాళ్లీ దారిద్య్రం?
అసంపూర్తిగా వదిలేసిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్దులు పడే వేదన వర్ణణాతీతం బీటీ నిర్మాణాలకు అయిదేళ్ల క్రితం నిధులు మంజూరు కావడంతో సంబరపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.
ధన్వాడ నుంచి పాతపల్లికి వెళ్లే రహదారి
ధన్వాడ, న్యూస్టుడే : అసంపూర్తిగా వదిలేసిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతలు, వృద్దులు పడే వేదన వర్ణణాతీతం బీటీ నిర్మాణాలకు అయిదేళ్ల క్రితం నిధులు మంజూరు కావడంతో సంబరపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది. అధికారులు పట్టించుకోకపోవడం వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.
* ధన్వాడ నుంచి పాతపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అడుగడునా గుంతలు పడింది. పదే పదే విన్నవించగా ఏడాది కిందట మరమ్మతులతో కూడిన తారు నిర్మాణానికి రూ. 65 లక్షలు మంజూరయ్యాయి. ఇంతవరకు గుత్తేదారు ఎంపిక కార్యక్రమం పూర్తి కాలేదు. పలుమార్లు గుత్తేదారు నియామకానికి టెండర్ ఆహ్వనించినా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారులే పనులు చేపట్టి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నా స్పందన లేదు. చదువకోడానికి నిత్యం వందల మంది పిల్లలు బిజ్వార్, కొత్తపల్లి, పాతపల్లి నుంచి ఈ రహదారి మీదుగానే రావాల్సి ఉంది. వర్షాకాలంలో కాలినడకన రావడమూ కష్టమేనన్న అభిప్రాయాన్ని విద్యార్థులతో పాటు ఆయా గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు
* హన్మన్పల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఆకుమర్రిండాకు 2018లో ప్రభుత్వం రూ. 2.19 కోట్ల నిధులతో తారురోడ్డును మంజూరు చేసింది. అదే ఏడాది పనులు చేపట్టగా కంకర పనులు పూర్తి అయ్యేదాకా మిన్నకుండిన రైతులు ఆ తర్వాత పొలాల గుండా రోడ్డు వేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కోర్టుకు వెళ్లారు. దీంతో అర్ధాంతరంగా పనులు నిలిచాయి. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని కోర్టుకెళ్లిన రైతులతో మాట్లాడి పిటిషన్ను వాపసు తీసుకునేలా కృషి చేశారు. ఆ తర్వాత మిగతా పనులు చేపట్టేందుకు గుత్తేదారు ఎంతకూ ముందుకు రాలేదు. దీంతో టెండర్ను రద్దు పర్చిన అధికారులు కొత్త గుత్తేదారుతో పనులు చేయిస్తామని కాలం గడుపుతున్నారు.
* కిష్టాపూర్ నుంచి గోటూర్ గ్రామానికి రోడ్డును బీటీగా మార్చేందుకు 2018లో పంచాయతీరాజ్ శాఖ రూ.1.83 కోట్ల నిధులను కేటాయించింది. అదే ఏడాది పనుల్ని చేపట్టిన గుత్తేదారు మొదట్లో కొంతమేర రోడ్డు వెడల్పు చేశారు. కొంత కాలం తర్వాత మిగతా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. కల్వర్టులు నిర్మించారు. కొన్ని నెలల కిందట కంకర పనులు మొదలెట్టారు. కంకర లభ్యం కావడంలేదంటూ అసంపూర్తిగా వదిలేశాడు. ప్రస్తుతం ఈ దారి మీదుగా వెళ్లాలంటే నరకం అనుభవించాల్సిందేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
* కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్య తండా వరకు ఉన్న పదకొండు కిలోమీటర్ల రహదారిని తారుగా మార్చేందుకు పంచాయతీరాజ్ శాఖ 2018 ఏడాదిలో రూ. 4.60 కోట్ల నిధులను కేటాయించింది. అదే ఏడాది పనులకు శంకుస్థాపన నిర్వహించగా, గుత్తేదారు రోడ్డు వెడల్పు, కల్వర్టుల నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేసి పత్తాలేకుండా పోయారు. పలుమార్లు నోటీసులు అందజేసినా స్పందన లేదు. ఏడాది దాటినా కొత్త గుత్తేదారు నియామక ప్రక్రియను పూర్తి చేయలేదు. పనులు అసంపూర్తిగా వదిలేయడంతో పనులు చేపట్టక ముందే రహదారి బాగుండేదన్న అభిప్రాయం పలు తండావాసులు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో రాకపోకలకు మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముడుగుల మల్లయ్య తండాకు వెళ్లే దారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని