మురుగు కాల్వల నిర్మాణంలో నాణ్యతాలోపం
పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోంది. ఓ వైపు నిర్మిస్తుండగా మరో వైపు అవి కూలిపోతున్నాయి.
విరిగిపడుతున్న పలకలు
అక్కడక్కడా పగుళ్లు
నాణ్యతాలోపం.. దిగబడిన వాహనం
పెబ్బేరు, న్యూస్టుడే: పట్టణంలో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన మురుగు కాల్వల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తోంది. ఓ వైపు నిర్మిస్తుండగా మరో వైపు అవి కూలిపోతున్నాయి. ప్రధాన రహదారుల నుంచి కాలనీలకు తిరిగే రోడ్ల వద్ద కాల్వలపై వేసిన పలకలు చిన్న వాహనాలు వెళ్లినా కూలిపడుతున్నాయంటే నాణ్యత ఏమాత్రమో అర్థం చేసుకోవచ్చు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనులు చేసే గుత్తేదారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందంటూ పట్టణ ప్రజలు వాపోతున్నారు. పనుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణాలకు నిధులు ఇలా..: పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. పోచమ్మ గుడి నుంచి పీజీపీ కార్యాలయం దాటి చౌడేశ్వరి ఆలయం వరకు డివైడర్కు ఇరువైపులా 2.3 కిలోమీటర్లు బీటీతో విస్తరణ, ఇరువైపులా మురుగు కాల్వలు నిర్మించడానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయుఎఫ్ఐడీసీ) నుంచి రూ.11 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.7 కోట్లతో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక్కో వైపు 8 మీటర్ల చొప్పున రెండు వైపులా 16 మీటర్లు విస్తరణతో బీటీ నిర్మించాలి. మరో రూ.4 కోట్లతో ఇదే రోడ్డుకు ఇరువైపులా 2.3 కిలోమీటర్ల దూరం పెద్ద మురుగు కాల్వలు నిర్మించాలి. పనులు కొన్ని నెలలుగా సాగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడక్కడా పగుళ్లు వస్తున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు స్పందించి తనిఖీలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం: పనులు నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యతా అధికారులు తనిఖీలు చేసిన తర్వాతనే గుత్తేదారుకు బిల్లుల చెల్లింపులు జరుగుతాయి.
రమేష్ నాయుడు, పురపాలిక ఏఈ, పెబ్బేరు
నీటిని తోడకుండానే సిమెంటు వేస్తున్న వైనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం స్వాధీనం, కేసు నమోదు
[ 28-03-2024]
మండలంలోని మాన్ దొడ్డి గ్రామం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
పూర్తయిన మగ్గాల సర్వే
[ 28-03-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేపడుతున్న క్లస్టర్ పథకం మగ్గాల పరిశీలన గురువారంతో పూర్తయ్యింది. -
దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
[ 28-03-2024]
రాజోలి గ్రామంలో వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
[ 28-03-2024]
శాంతినగర్ పోలీస్ స్టేషన్లో గురువారం జిల్లా ఎస్పీ రితిరాజ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 13 మంది బాధితులు వివిధ సమస్యలపై ఆమెకు ఫిర్యాదులు అందజేశారు. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
[ 28-03-2024]
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్
[ 28-03-2024]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
[ 28-03-2024]
జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. -
అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 28-03-2024]
అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు -
గద్వాల పట్టణంలో భారీ చోరీ
[ 28-03-2024]
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది. -
మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
[ 28-03-2024]
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మక్తల్ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. -
నాగర్కర్నూల్ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం
[ 28-03-2024]
భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్ సభ్యుడు పి.రాములు అన్నారు. -
డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
[ 28-03-2024]
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. -
మన్యంకొండలో పూర్ణాహుతి
[ 28-03-2024]
మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో... -
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
[ 28-03-2024]
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. -
అడుగంటుతున్న వరదాయని
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. -
మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. -
చిన్నారులకు బాల ఆధార్
[ 28-03-2024]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. ఇది గుర్తింపుకార్డు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఇదే ప్రామాణికంగా మారింది. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ... -
పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
[ 28-03-2024]
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అనిశా వలలో తహసీల్దార్
[ 28-03-2024]
ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. -
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 28-03-2024]
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు