బడి తెరిచే రోజే పాఠ్యపుస్తకాలు
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ నుంచి పాఠ్య పుస్తకాల పంపడం మొదలెట్టింది.
న్యూస్టుడే, నారాయణపేట పట్టణం : సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు తొలి రోజు పాఠ్య పుస్తకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ నుంచి పాఠ్య పుస్తకాల పంపడం మొదలెట్టింది.
ఇప్పటి వరకు 73 శాతం పుస్తకాలను జిల్లాకు సరఫరా చేయగా గోదాంలో భద్రపరిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. పుస్తకాల ముద్రణలో ఆలస్యం కావడంతో గత ఏడాది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. 2023-24 విద్యా సంవత్సరంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తుగా పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మండలాలకు పుస్తకాలను తరలించడానికి జిల్లా విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫలితాలపై ప్రభావం పడకుండా...
గతంలో పాఠశాలలకు సకాలంలో పుస్తకాలు రాకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. ఈ సమస్యను అధిగమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది ఆంగ్లమాధ్యమం పుస్తకాలు ఆక్టోబరు, నవంబరు వరకు సరఫరా అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుడదని 2023 - 24 విద్యా సంవత్సరానికి విడతలవారీగా ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తున్నారు. పక్కదారి పట్టకుండా వాటి వివరాలను నమోదు చేసుకుని, గోదాంలో భద్రపరిచారు.
ఆంగ్లమాధ్యమం పుస్తకాల్లో ఒక వైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు. ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈసారి అన్నీ వరుస సంఖ్యను ముద్రించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు ప్రైవేటు పాఠశాలల్లో దర్శనం ఇస్తుంటాయి. బహిరంగ మార్కెట్లో ధరలు రూ. వందల్లో ఉండటంతో తెలిసినవారి ద్వారా బయటి విద్యార్థులు పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త విధానం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి.
నారాయణపేటకు పుస్తకాలు తీసుకువచ్చిన ఆర్టీసీ కార్గో వాహనం
జిల్లాలో మొత్తం పాఠశాలలు 514
మొత్తం విద్యార్థుల సంఖ్య 72,493
అవసరమైన పాఠ్యపుస్తకాలు 3,96,459
వచ్చినవి 2,90,559
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి సెలవులు ఆరంభం
[ 23-04-2024]
జిల్లాలోని 461 ప్రభుత్వ పాఠశాలలు, 12 కస్తూర్భాలు, 145 ప్రైవేట్ పాఠశాలలకు విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
యువత క్రీడల్లో రాణించాలి
[ 23-04-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత అన్ని క్రీడల్లో రాణించాలని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత అన్నారు. -
భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
[ 23-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శ్రీలక్ష్మి వైకుంఠ నారాయణస్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి ... -
మగువలే నిర్ణేతలు
[ 23-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభా స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని మహిళా ఓటర్లే ప్రభావితం చేయనున్నారు. -
సీఎం నేడు సుడిగాలి పర్యటన
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
జోరందుకున్న నామపత్రాల సమర్పణ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల గడువు ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పత్రాల సమర్పణ జోరందుకుంటోంది. -
ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ
[ 23-04-2024]
రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. -
లోక్సభ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికను భాజపా నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కర్ణాటక రాష్ట్రం దక్షిణ బెలగావి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సూచించారు. -
ఆత్మీయ నేస్తం.. దారిచూపే దీపం
[ 23-04-2024]
పుస్తకం ఆత్మీయ నేస్తం. కారు చీకట్లో దారి చూపించే దీపం. మేధావులంతా ఏదో ఒక పుస్తకాన్ని చదివి ప్రభావితమైన వారే. -
మోదీతోనే దేశం బలోపేతం
[ 23-04-2024]
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా బలోపేతమవుతుందని, భద్రతపరంగా సురక్షితంగా ఉంటుందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఎన్నికల తర్వాత భారాస కనుమరుగు : ఎమ్మెల్యే
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికలయ్యాక భారాస కనుమరుగవుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. అడ్డాకులలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడ్డాకుల ఎంపీపీ నాగార్జునరెడ్డితో పాటు వివిధ గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే -
కొనసాగుతున్న ప్రసాద్ పనులు
[ 23-04-2024]
నిర్మించి ఏడాదైనా కాకుండానే, ఇంకా పనులు కొనసాగుతుండగానే, నిర్మాణాలు పూర్తికాకుండానే ప్రసాద్ పథకం భవనంలోని మొదటి అంతస్తులో నిర్మించిన గదులకు పగుళ్ల రావడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. -
‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్’
[ 23-04-2024]
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. -
సమస్యలపై నేరుగా ఫిర్యాదు చేయండి
[ 23-04-2024]
నాగర్కర్నూల్ సర్కిల్ సీఐ కార్యాలయం గతంలో పట్టణంలోని ఠాణా మొదటి అంతస్తులో ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు
[ 23-04-2024]
మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.విజయ్కుమార్ తెలిపారు. -
అన్నదానం నిధుల రికవరీ
[ 23-04-2024]
ఉమామహేశ్వర క్షేత్రంలో పక్కదారి పట్టిన నిత్యాన్నదాన నిధులను రికవరీ చేసినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి శ్రీనివాస్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM