గుప్త నిధుల తవ్వకాలు: ఎనిమిది మంది రిమాండు
అలంపూర్ పట్టణం పాపనాశి ఆలయ సమీపంలోని మబ్బుమఠంలో ఉన్న పురాతన ఆలయంలో శివలింగాన్ని చోరీ చేసిన ఘటనలో ఎనిమిది మందికి గురువారం రిమాండ్ విధించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
చోరీకి గురైన శివలింగం, అదుపులో నిందితులు
అలంపూర్, న్యూస్టుడే: అలంపూర్ పట్టణం పాపనాశి ఆలయ సమీపంలోని మబ్బుమఠంలో ఉన్న పురాతన ఆలయంలో శివలింగాన్ని చోరీ చేసిన ఘటనలో ఎనిమిది మందికి గురువారం రిమాండ్ విధించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన భక్తులకు శివలింగం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. పట్టణానికి చెందిన నాగమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశీలించినట్లు తెలిపారు. ర్యాలంపాడు వంతెన వద్ద ఇద్దరు వ్యక్తులు గురువారం అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ శివలింగం అడుగుభాగంలో గుప్త నిధులున్నాయనే అనుమానంతో కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన నలుగురు, ఆత్మకూరుకు చెందిన నలుగురు కలిసి శివలింగం చోరీ చేసినట్లు వెల్లడైంది. దీనిని తీసుకొస్తే పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని హైదరాబాద్కు చెందిన మోహన్రావు చెప్పడంతో చోరికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కాశీ అనే వ్యక్తి ఇంట్లో దాచిన శివలింగాన్ని పోలీసులు తీసుకొచ్చారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన ఎనిమిది మంది (హర్ష, తిరుపాటి శేఖర్, నల్లబోతుల కాశీమ్, హనుమంతు, రామలింగం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ)తో పాటు ద్విచక్ర వాహనం, తవ్వకాలకు ఉపయోగించిన ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులని అలంపూర్ కోర్టులో రిమాండుకి తరలించిన్నట్లు ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
మండంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. -
అమాత్యుడి హామీ అమలయ్యేనా?
[ 29-03-2024]
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. -
నీడ చాటున నిధులు మాయం
[ 29-03-2024]
ధన్వాడ మండలం కంసాన్పల్లి పంచాయతీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఈ ఏడాది పదివేల మొక్కల్ని పెంచుతున్నారు. -
మొక్కలు మాడిపోతున్నాయ్
[ 29-03-2024]
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. -
ప్రజాధనం వృథా
[ 29-03-2024]
జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. -
ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ
[ 29-03-2024]
కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్లైన్ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. -
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
[ 29-03-2024]
మహబూబ్నగర్ న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట
[ 29-03-2024]
ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. -
విద్యార్థుల్లో ప్రేరణ కలిగేలా..
[ 29-03-2024]
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘ప్రేరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
గద్వాలలో భారీ చోరీ
[ 29-03-2024]
గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం
[ 29-03-2024]
మండలంలోని వేపూర్కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇక్కడ నిండి.. ఏపీకి తరలింపు
[ 29-03-2024]
అలంపూర్ నియోజకవర్గంలోని శీతల గిడ్డంగులు నిండుకోవడంతో ఏపీ సమీపంలోని కర్నూలు పట్టణం గిడ్డంగులకు మిర్చి బస్తాలను ఇక్కడి రైతులు తరలిస్తున్నారు. -
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త
[ 29-03-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని ఎస్పీ యోగేశ్గౌతం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్