ప్రసూతికి ప్రభుత్వ ఆసుపత్రులకే!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రసూతి సేవలు పొందేవారు.
70 శాతానికి పైగా మహిళల సద్వినియోగం
ప్రైవేట్ ఆసుపత్రుల్లో తగ్గుతున్న కాన్పులు
దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతతో మాట్లాడుతున్న మహబూబ్నగర్ జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ
న్యూస్టుడే, పాలమూరు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేసి ప్రసూతి సేవలు పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా మెరుగైన ప్రసూతి సేవలు అందిస్తుండటంతో సద్వినియోగం చేసుకుంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యులను నియమించడం, సరిపడా ఔషధాలు, సిబ్బంది, సదుపాయాలను సమకూర్చడంతో సేవలు మెరుగుపడ్డాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులపై భారం తగ్గింది. క్లిష్టమైన కేసులు మాత్రమే జనరల్ ఆసుపత్రులకు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సేవలు పొందిన వారికి కేసీఆర్ కిట్తో పాటు ప్రోత్సాహక నగదు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గర్భం దాల్చిన మహిళ తన కడుపుతో ఉన్న శిశువు అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందాయో లేదో పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం కలిగింది. అన్ని రకాల రక్త పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ఉచితంగా చేస్తున్నారు. ఇలా చాలా రకాల అనుకూల పరిస్థితులు ఉండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాల మహిళల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తున్నారు. ప్రసూతి సేవలకు రూ.30వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తుండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లటం లేదు.
13వ స్థానంలో గద్వాల జిల్లా..
రాష్ట్రంలో ఎక్కువ కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, తక్కువ ప్రసవాలు ప్రైవేట్ దవాఖానాల్లో జరుగుతున్న జిల్లాల్లో వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హనుమకొండ, మూడో స్థానంలో జగిత్యాల జిల్లాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాలోని జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. 22వ స్థానంలో నాగర్కర్నూల్, 25వ స్థానంలో నారాయణపేట, 26వ స్థానంలో వనపర్తి, 27వ స్థానంలో మహబూబ్నగర్ జిల్లా ఉన్నాయి. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో నమోదైన ప్రసవాల గణాంకాల ఆధారంగా వీటి పనితీరును నిర్ధారణ చేశారు. ఉదాహరణకు మహబూబ్నగర్ జిల్లాలో జులైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,088 మందికి కాన్పులు చేయగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 303 మందికి ప్రసవాలు నమోదయ్యాయి. ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,044 కాన్పులు చేయగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 276 కాన్పులు జరిగాయి.
ప్రసవానికి ఆసుపత్రికి వచ్చేలా అవగాహన
- డా.కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహబూబ్నగర్
ప్రభుత్వ ఆదేశాలు అమలుచేస్తూ ఇంటి వద్ద ప్రసవాలను పూర్తిగా నివారించాం. ప్రసూతికి ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. జనరల్ ఆసుపత్రులతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఎక్కువ కాన్పులు జరుగుతున్నాయి. వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన సేవలు అందుతున్నాయి. ఫలితంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు