జిల్లా అంతటికీ శాశ్వత తాగునీటి పథకం!
జిల్లా అంతటా ఒకే పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈమేరకు అంచనాలు రూపొందించారు.
గోపాల్పేటలో నిర్మించిన పంపింగ్ గది, ఓవర్హెడ్ వాటర్ట్యాంకు
వనపర్తి వ్యవసాయం, న్యూస్టుడే : జిల్లా అంతటా ఒకే పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈమేరకు అంచనాలు రూపొందించారు. వేసవిలో ప్రజలు మంచినీటి సమస్య ఎదుర్కొనకుండా ఇప్పటికే రూ.300 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం పనులు ప్రారంభించారు. శ్రీశైలం తిరుగుజలాల ద్వారా మిషన్ భగీరథ పథకంలో భాగంగా నిర్మాణం చేపట్టారు. గోపాల్పేటలో 10 ఎంఎల్డీ సామర్థ్యం గల నీటిశుద్ధి ప్లాంటు, పెద్దమందడి మండలం బుగ్గపల్లితండాలో 75 ఎంఎల్డీ నీటిశుద్ధి ప్లాంటు నిర్మించారు. వాటికి అనుబంధంగా ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు, క్లోరినేషన్ ప్లాంట్లు, పంపింగ్ గదులు నిర్మించారు. ఈ పథకాన్ని ఆత్మకూరు, అమరచింత, పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ అయిదు మండలాల పరిధిలోని 112 నివాస ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాలంటే రూ.130 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
బుగ్గపల్లి నుంచి 256 నివాస ప్రాంతాలకు
పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి తండాలో నిర్మిస్తున్న 75 ఎంఎల్డీ నీటిశుద్ధి ప్లాంటు నుంచి ప్రతి రోజూ 256 నివాస ప్రాంతాలకు నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే వనపర్తి పట్టణానికి అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తి కావడంతో ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. కానాయపల్లిలోని నీటిశుద్ధి ప్లాంటు నుంచి ఇప్పటికే సరఫరా కొనసాగుతోంది. గోపాల్పేటలోని ప్లాంటు నుంచి 52 నివాస ప్రాంతాలకు సరఫరాకు ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. రేవల్లి, గోపాల్పేట మండలాలతో పాటు వనపర్తి మండలంలోని కొన్ని గ్రామాలకు గోపాల్పేట నుంచి సరఫరా అవుతోంది.
శ్రీశైలం తిరుగుజలాల వినియోగం
మిషన్ భగీరథ పథకం ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు శ్రీశైలం తిరుగుజలాలను వినియోగిస్తున్నారు. రేగుమాన్గడ్డ నుంచి రా వాటర్ను రేవల్లి మండలం నాగపూరు వద్ద నిర్మించిన నీటిశుద్ధి ప్లాంటుకు తరలిస్తున్నారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. జడ్చర్ల, మహబూబ్నగర్లకు రా వాటర్నే పంపుతున్నారు. నాగపూరు నుంచి గోపాల్పేట, బుగ్గపల్లితండా, కానాయపల్లిలకు రా వాటర్ సరఫరా చేస్తున్నారు. అక్కడ శుద్ధిచేసి నివాస ప్రాంతాలకు అందజేస్తున్నారు.
నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తానికి..
రూ.300 కోట్లతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు పథకం రూపకల్పన చేశారు. జిల్లా మొత్తానికి ఈపథకం ద్వారా సరఫరా చేయాలన్న మంత్రి నిరంజన్రెడ్డి సూచన మేరకు అధికారులు అన్ని మండలాలకు పథకాన్ని విస్తరించే పనుల్లో ఉన్నారు. నియోజకవర్గంలోని రేవల్లి, గోపాల్పేట, వనపర్తి, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం, ఖిల్లాగణపురం మండలాలకు మంచినీటిని సరఫరా చేయడానికి పథకం సిద్ధమైంది. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలను ఇందులోకి తీసుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు రూ.300 కోట్ల ప్రత్యేక పథకం ద్వారా సరఫరాకు నిర్ణయించారు.
ప్రతిపాదనలు పంపించాం
- జగన్ మోహన్, ఎస్ఈ, మిషన్భగీరథ
జిల్లాలో రూ.300 కోట్లతో చేపట్టిన శ్రీశైలం తిరుగుజలాలతో తాగునీటి సరఫరా పథకం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈపథకం ద్వారా 308 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లా పరిధిలోని మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గంలోని 112 ఆవాస ప్రాంతాలకు ఈ పథకం ద్వారా నీటి సరఫరాకు రూ.130 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించాం. మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.


తాజా వార్తలు (Latest News)
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల