పోషణ లేని మాసం
అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షురాలు శశికళ డిమాండ్ చేశారు.
అంగన్వాడీల సమ్మె ప్రభావం
గర్భిణులు, పిల్లలకు అందని ఆహారం
గడిమున్కన్పల్లిలో అంగన్వాడీ కేంద్రం తెరవకుండా అడ్డుకుంటుకున్న దృశ్యం
న్యూస్టుడే- నారాయణపేట పట్టణం, మక్తల్ గ్రామీణం: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఏటా పోషణ మాసం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఎలాంటి పోషణా లేకుండా పోయింది. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం చెల్లించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. ఫలితంగా చిన్నారులకు పౌష్టికాహారం అందటం లేదు. కొన్నిచోట్ల తాళాలు పగలగొట్టి స్థానిక అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేంద్రాలను బలవంతంగా తెరవవద్దని సిబ్బంది, నాయకులు అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితిలో అంగన్వాడీలపై ఆధారపడే బీదాబిక్కీ పిల్లలు, గర్భిణులు సరైన తిండిలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలోని 13 మండలాలు మూడు ప్రాజెక్టుల పరిధిలో విస్తరించి ఉన్నాయి. 704 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి బరువు తక్కువగా ఉన్నవారు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారి గుర్తింపు, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలు నిలిచిపోయాయి. చాలా గ్రామాల్లో అధికారులు స్థానిక కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఆహార పంపిణీ బాధ్యతలను బదలాయించారు. వారంతా ఇతర కార్యక్రమాలు, వ్యాపకాలతో అంగన్వాడీలను అంతగా పట్టించుకోవడం లేదు.
- అంగన్వాడీ టీచర్లు బీఎల్వోలుగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టేవారు. సమ్మె ప్రభావం ఓటరు నమోదుపై కూడా పడుతోంది.
- నారాయణపేట జిల్లా కేంద్రం, ఊట్కూరు, పులిమామిడి సిబ్బంది సమ్మెలో పాల్గొనడం లేదు.
- దామరగిద్ద మండలం గడిమున్కన్పల్లిలో కేంద్రం తెరిచి పోషకాహారం అందించాలని నిర్ణయించినా టీచర్లు, సహాయకులకు మద్దతుగా సీపీఎం నాయకులు. మాజీ వైస్ ఎంపీపీ మహేశ్ కుమార్ గౌడ్ అడ్డుకున్నారు. కేంద్రం తాళం పగలగొట్టకుండా అధికారులతో వాగ్వాదానికి దిగారు. బైరంకొండ, ధన్వాడల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
- మక్తల్ పురపాలికలో 26 కేంద్రాలు, జక్లేర్ పరిధిలో 17, మంథన్గోడ్ సెక్టారులో 20, కర్ని ప్రాంతంలో 23 మొత్తం 88 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటికి కొత్తగా వచ్చిన స్టాక్ను సూపర్వైజర్ల ద్వారా చేరవేశారు. తాళాలు విరగ్గొట్టి పంచాయతీలకు బాధ్యతలు అప్పగించినా అనుకున్న విధంగా పంపిణీ సాగడం లేదు.
- మద్దూరు ప్రాజెక్టు పరిధిలో 207 అంగన్వాడీ కేంద్రాలు కొన్ని రోజుల క్రితం వరకు సీడీపీవో వివాదంతో తెరుచుకోలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తే అంగన్వాడీల నిరవధిక సమ్మెతో మళ్లీ మూతపడ్డాయి.
జిల్లాలో కేంద్రాలు
మొత్తం అంగన్వాడీ కేంద్రాలు : 704
ప్రాజెక్టులు 03
గర్భిణులు 5,209
బాలింతలు 4,423
7 నెలలు-03 ఏళ్ల చిన్నారులు 21,505
3 - 6 ఏళ్ల చిన్నారులు 13,452
తక్కువ బరువు ఉన్నవారు 409
పౌష్టికాహారంలోపం బాధితులు 664
కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడీలు
బుధవారం కలెక్టరేట్ గేటు ముందు అంగన్వాడీల ధర్నా
నారాయణపేట(పాతబస్టాండ్), న్యూస్టుడే : అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షురాలు శశికళ డిమాండ్ చేశారు. తమ సమ్మె శిబిరమైన పేట పురపార్కు నుంచి కలెక్టరేట్కు బుధవారం ర్యాలీగా వెళ్లి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటు ముందు నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలపై రాళ్ల దాడులు చేస్తున్నారని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు అందించారు. ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కు తరలించి విడుదల చేశారు. కార్యక్రమంలో బలరాం, గోవిందరాజు, మంజూల, వసంత, రాధ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
వేణుగోపాల్, డీడబ్ల్యూవో, నారాయణపేట.
జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు సమ్మెలో ఉన్నందున సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ఇంటికి సరకులు చేరవేస్తాం. చిన్నారులు ప్రీ స్కూల్ విద్యకు దూరం కాకుండా టీ-శాట్లో కార్యక్రమాలను తల్లిదండ్రులకు పంపించాం. డిజిటల్ నమూనాలో పిల్లలకు విద్యను అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.


తాజా వార్తలు (Latest News)
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు