143 జీహెచ్ఎంలకు స్థాన చలనం
ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జీహెచ్ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్ఎంల ఖాళీలు ఏర్పడగా వాటిలో 143 మందిని బదిలీల ద్వారా నియమించారు.
మిగిలిన ఖాళీలు 208
పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం
అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంలు, ఉపాధ్యాయులు
అచ్చంపేట, న్యూస్టుడే : ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న జీహెచ్ఎంల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్ఎంల ఖాళీలు ఏర్పడగా వాటిలో 143 మందిని బదిలీల ద్వారా నియమించారు. ఇంకా 208 ఖాళీలు ఉండగా వాటిని స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. జీహెచ్ఎంల పోస్టులను జోనల్ పోస్టులుగా గుర్తించడంతో బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న వారిలో చాలా మంది రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో సీనియర్ ఎస్ఏలకు జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల తరువాత పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
మల్టీ జోన్-2లో ఉమ్మడి జిల్లా..
జీహెచ్ఎంల పోస్టులను జోనల్ స్థాయి పోస్టుగా గుర్తించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను రెండు జోన్లుగా విభజించారు. మల్టీ జోన్-1లో 20 జిల్లాలు ఉండగా మల్టీ జోన్-2లో 13 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాను రెండో జోన్లో చేర్చారు. జీహెచ్ఎంల బదిలీల సందర్భంగా అనుకూలమైన జిల్లాలకు ఆప్షన్లు ఇవ్వడంతో అత్యధికులు రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 351 జీహెచ్ఎంల ఖాళీలు ఏర్పడగా కేవలం 143 మాత్రమే బదిలీల్లో భర్తీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్లో మాత్రమే ఎక్కువ మంది జీహెచ్ఎంలు బదిలీని కోరుకున్నారు. మొత్తం 81 ఖాళీలు ఉండగా బదిలీల్లో 70 భర్తీ కాగా ప్రస్తుతం 11 ఖాళీలు మాత్రమే మిగిలాయి. నారాయణపేట జిల్లాలో 51 ఖాళీలు ఉండగా బదిలీల్లో కేవలం నలుగురు మాత్రమే ఆ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. దాంతో అత్యధికంగా 47 ఖాళీలు మిగిలాయి. నాగర్కర్నూల్ జిల్లాలో 93 ఖాళీలు ఉండగా 21 మంది మాత్రమే బదిలీల్లో ఈ జిల్లాను ఎంపిక చేసుకోగా అత్యధికంగా ఇంకా 72 ఖాళీలు మిగిలి ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 69 ఖాళీలు ఉండగా బదిలీల్లో 20 భర్తీ కాగా ఇంకా 49 ఖాళీలు మిగిలి ఉన్నాయి. మల్టీ జోన్-2లో ఉన్న పది జిల్లాల్లో ఆసక్తి ఉన్న జిల్లాను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం మిగిలిన 208 ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. పదోన్నతుల్లో కూడా జోన్ పరిధిలోని ఆసక్తి ఉన్న జిల్లాను ఎస్ఏలు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. బదిలీ అయిన జీహెచ్ఎంలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరారు.
వేతనాల చెల్లింపులకు ఇబ్బందులు లేకుండా చర్యలు..
బదిలీల్లో కొందరు జీహెచ్ఎంలు కొత్త స్థానాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ పాఠశాల, సముదాయం పరిధిలోని ఉపాధ్యాయులకు వేతనాలు అందించడంలో జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు డీడీవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సముదాయ పాఠశాల హెచ్ఎంలు దాని పరిధిలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. పదోన్నతుల ద్వారా కొత్త జీహెచ్ఎంలు వచ్చే లోపున ఆ పాఠశాలల్లోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. డ్రాయింగ్, డిస్బర్సల్ ఆఫీసర్ (డీడీవోలు)గా బాధ్యతలు చేపట్టి వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.