చదివిందొకటి.. చెప్పేది మరోటి!
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వీరు. సుమారు 40 మంది ఉన్నారు.
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు వీరు. సుమారు 40 మంది ఉన్నారు. మొత్తం పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 300 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో కీలకమైన భౌతిక ర¢సాయనశాస్త్రం, గణిత ఉపాధ్యాయులులేరు. దీంతో విద్యార్థులు బోధన పరంగా నష్టపోతున్నారు. మరి.. వీరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించగలుగుతారు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 25 పాఠశాలల్లో ఉంది
కేటీదొడ్డి, ధరూరు, న్యూస్టుడే: ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేకున్నా ఇబ్బంది ఉండదు. కానీ 6 నుంచి పదో తరగతి వరకు మాత్రం కచ్చితంగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉంటేనే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. మంచి ఫలితాలూ సాధ్యమవుతాయి. ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తూ వస్తోంది. కానీ అప్గ్రేడ్ అయిన పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ మాత్రం చేపట్టడంలేదు. 2014లో ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ చేపట్టిందే తప్ప తర్వాత దాని ఊసే లేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడబోతోంది. దీని ఫలితంగా బోధనలో లోపాల వల్ల ఉత్తమ ఫలితాలు పొందలేని పరిస్థితి ఆ పాఠశాలల విద్యార్థులది. పాఠశాల పంపిస్తున్న మాటేకాని విద్యార్థులకు మంచి చదువు అందడం లేదని తల్లిదండ్రులు మదనపడుతున్నారు.
జిల్లాలో 25 పాఠశాలల్లో..: జోగులాంబ జిల్లాలో కొన్ని ఉన్నత, ఉన్నతీకరణ పొందిన 25 పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. ఉన్న సబ్జెక్టు ఉపాధ్యాయులు, స్కూల్ అస్టిటెంట్లు వారికి సంబంధంలేని సబ్జెక్టులు కూడా బోధించాల్సి వస్తోంది. కేటీదొడ్డి మండలంలో ఇర్కిచేడు, ధరూరు మండలం అల్వాల్పాడు, గార్లపాడు, మన్నాపురం, కొత్తపాలెం పాఠశాలల్లోను అదే పరిస్థితి. గద్వాల్ మండలంలో జమ్మిచేడు, అయిజ మండలంలో ఉత్తనూరు ఇలా జిల్లాలో దాదాపు 25 పాఠశాలల్లో 70 వరకు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి జిల్లాలో ఉన్నట్లు విద్యాశాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. కేటీదొడ్డి, కుచినేర్ల పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేశారు. రెండు పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు తప్ప ఇతర సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. ఎస్జీటీ ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం వీటిని భర్తీ చేసే ప్రక్రియ కూడా కనుచూపు మేరలో కనిపించటం లేదు. భర్తీ చేయాలంటే ప్రభుత్వం మరోసారి రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా బోధన చేసే సామర్థ్యమున్న విద్యావలంటీర్ల తక్షణ నియామకంతోనే విద్యార్థులు చదువులు గాడిన పడుతాయని తల్లిదండ్రులు అంటున్నారు.
పరీక్షలు గట్టెక్కేదెలా..
- ఆశ్విని, పదో తరగతి, ఇర్కిచేడు ఉన్నత పాఠశాల
జడ్పీహెచ్ఎస్ ఇర్కిచేడు ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మాకు గణితం, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు లేరు. కొన్ని రోజుల కిందటి వరకు ఓ ఉపాధ్యాయుడు స్వచ్ఛందగా వచ్చి బోధించేవారు. ఆయన మానేయడంతో రెండు సబ్జెక్టుల్లో పది పరీక్షల్లో ఎలా గట్టెక్కాల్లో అర్థం కావటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.


తాజా వార్తలు (Latest News)
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం