పదోన్నతులకు కసరత్తు
ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో అన్నీ లెక్క ప్రకారం జరిగినా.. పదోన్నతుల ప్రక్రియలో కొందరు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.
నాడు వద్దని.. నేడు కావాలంటున్న ఉపాధ్యాయులు
నిబంధనలు ఉలంఘిస్తూ దరఖాస్తుల నమోదు
డైట్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్లో ఆన్లైన్లో వివరాలు క్రోడీకరిస్తున్న అధికారులు
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం: ప్రధానోపాధ్యాయుల బదిలీల్లో అన్నీ లెక్క ప్రకారం జరిగినా.. పదోన్నతుల ప్రక్రియలో కొందరు అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ విడుదల చేసిన తాత్కాలిక సీనియారిటీ జాబితాలో లోపాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయ పదోన్నతులను గతంలో రెండు సార్లు తిరస్కరించిన కొందరు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు మళ్లీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించినట్లు ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
దస్త్రాల నిర్వహణలో నిర్లక్ష్యం : 2009లో విడుదలైన ఉత్తర్వు నం.11, 12 ప్రకారం పదోన్నతుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. ఉత్తర్వు నం.145 ప్రకారం పదోన్నతి సమయంలో రెండుసార్లు ‘నాట్ విల్లింగ్’ ఇస్తే మళ్లీ సీనియారిటీ జాబితాలో చోటు కల్పించొద్దు. ఈ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తగా సీనియారిటీ జాబితాను విద్యాశాఖ రూపొందించాలి. పదోన్నతి తిరస్కరించిన ఉపాధ్యాయుల సర్వీసు పుస్తకాల్లో నమోదు చేయాలి. 2009, 2013లో నాట్ విల్లింగ్ ఇచ్చిన వారు శాశ్వతంగా ఆయా సబ్జెక్టుల్లో పదోన్నతులకు దూరమవుతారు. జిల్లాలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా సీనియారిటీ జాబితాలు తయారు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.
అభ్యంతరాలకు అవకాశం : స్కూల్ అసిస్టెంట్లను 1:3 నిష్పతిలో పదోన్నతికి ఎంపిక చేస్తూ తాత్కాలిక జాబితాను విడుదల చేశారు. వీటిలో లోపాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు గురువారం వరకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. పదోన్నతులపై రేపో, మాపో స్పష్టత రానుందనే ప్రచార నేపథ్యంలో పదోన్నతి జాబితాలో ఉన్నవారంతా జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి.. ఉండే చోటు నుంచి దూరమెంత.. విద్యార్థుల సంఖ్య.. తదితరాలపై ఆరాతీస్తున్నారు.
మండల కేంద్రాల్లో పునఃపరిశీలన : రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా జిల్లా కమిటీ సభ్యులు మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వారికి కేటాయించిన కోటాకు అనుగుణంగా ఉన్నారా.. లేరా అనేది పరిశీలిస్తున్నారు. సర్వీస్ రిజిస్టర్లు(ఎస్ఆర్లు) పరిశీలిస్తున్నారు. రిజర్వేషన్లలో వచ్చారా.. పీహెచ్ కోటాలో వచ్చారా.. నేరుగా జరిగిన నియామకమా.. పదోన్నతితో వచ్చారా.. అనే నిష్పత్తి మేరకు (అడిక్వసీ) లెక్క తీస్తున్నారు. స్వీయ ధ్రువీకరణ తీసుకుంటున్నారు. ఖాళీలను బట్టి పదోన్నతి కల్పించనున్నారు.
నిబంధనల ప్రకారం చర్యలు : కొందరు ఉపాధ్యాయులు గతంలో రెండు పర్యాయాలు నాట్ విల్లింగ్ ఇచ్చిన వారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకున్నట్లు అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలిస్తాం. నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతి, బదిలీ పొందేందుకు ప్రయత్నించే వారిపై సీసీఎల్ఏ రూల్స్ ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
ఎ.రవీందర్, జిల్లా విద్యాశాఖ అధికారి, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలసి.. సొలసి.. ఆటవిడుపు
[ 02-12-2023]
నెల రోజులపాటు పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలతో బుర్ర వేడెక్కిన అభ్యర్థులు పోలింగ్ గురువారం పూర్తవ్వడంతో శుక్రవారం పూర్తి ఉపశమన స్థితికి వచ్చేశారు. -
పాలమూరులో తగ్గిన పోలింగ్..!
[ 02-12-2023]
పాలమూరులో ఈ శాసనసభ ఎన్నికల్లో 79.92 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 2018 ఎన్నికల్లో 81.94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఓటింగ్ శాతం 2018 ఎన్నికలతో పోలిస్తే కొంత మేర తగ్గింది. గతంతో పోల్చుకుంటే సగటున 2.02 శాతం ఓట్లు తగ్గాయి. -
దేవదేవుడి సన్నిధిలో సందడి
[ 02-12-2023]
దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. -
కొత్త మద్యం దుకాణాలు షురూ
[ 02-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొత్తగా మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు శుక్రవారం విక్రయాలు ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో కొత్త మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. -
ఆర్టీసీకి ఓట్ల పండగే
[ 02-12-2023]
శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వివిధ నగరాలు, పట్టణాల్లో ఉంటున్న ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. -
కనీస మద్దతుకు మించి ధరలు
[ 02-12-2023]
రైతులు పండించిన సోనా రకం వరికి మంచి ధరలు లభిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ వ్యవసాయ మార్కెట్లలో క్వింటాలుకు రూ.3,000 మించి ధర లభిస్తుండటం విశేషం. -
సందడి మాయం!
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా మారాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేవి. -
ఈవీఎంల భద్రత కట్టుదిట్టం
[ 02-12-2023]
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలను పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరీక్షల విభాగంలోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. -
1983 నుంచి జిల్లాకేంద్రంలో ఓట్ల లెక్కింపు
[ 02-12-2023]
తొలి శాసనసభ ఎన్నికల నుంచి నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు జరిగేది. 1983 నుంచి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తే గ్రామాల నుంచి అభ్యర్థుల అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!
[ 02-12-2023]
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. -
నేర వార్తలు
[ 02-12-2023]
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, అత్త, మామను వేధిస్తూ చివరకు మామను హత్య చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపల్లి గ్రామానికి చెందిన సోనమోని వెంకటయ్య (50). -
మూడోసారి భారాస ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
[ 02-12-2023]
కాంగ్రెస్ పార్టీ బూటకపు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని, వాటిని ఎవరూ నమ్మొద్దని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్లోని భారాస కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఈవీఎంల తరలింపు పూర్తి
[ 02-12-2023]
అలంపూర్ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం, బీయూ, సీయూలను ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అలంపూర్చౌరస్తాలోని ఎన్నికల రిసెప్షన్ కేంద్రానికి చేర్చారు. -
బహిరంగ ధరలు భళా... కొనుగోలు కేంద్రాలు వెలవెల
[ 02-12-2023]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రైతులు ఆశిస్తున్న ధర లేకపోవడమే ఇందుకు కారణం చెప్పవచ్చు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం క్వింటాల్ ధర రూ. మూడు వేలకు పైగా పలుకుతుంది. -
మనోధైర్యమే అసలు చికిత్స
[ 02-12-2023]
ఎయిడ్స్ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. -
ఎవరి అంచనాలు వారివే
[ 02-12-2023]
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల ప్రచారం నువ్వా.. -
కొడంగల్లో ఓటెత్తిన జనం
[ 02-12-2023]
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతగా కొనసాగాయి. పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. -
నిండా పూడికే !
[ 02-12-2023]
ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.


తాజా వార్తలు (Latest News)
-
WPL Auction: డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం.. స్లాట్లు 30.. అందుబాటులోకి 165 మంది
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి