మహబూబ్నగర్లో ఎమ్ఎస్ఎఫ్ అధ్వర్యంలో ఆందోళన
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో ఎమ్ఎస్ఎఫ్ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
మహబూబ్నగర్ (విద్యావిభాగం) : ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో ఎమ్ఎస్ఎఫ్ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ లోని రాయచూర్ -హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. పార్లమెంటు సమావేశాల్లో మొదటగా వర్గీకరణ బిల్లును చేర్చి ఆమోదింపజేసి ఎస్సీలకు న్యాయం చేయాలని ఎమ్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి 29 ఏళ్ల మాదిగల సుదీర్ఘమైన పోరాటానికి న్యాయమైన ముగింపునివ్వాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్ మాదిగ, నాగేందర్ మాదిగ, సాంబ మాదిగ, పంతీష్ మాదిగ, నరసింహ మాదిగ, వెంకటేష్ మాదిగ రాజ మాదిగ మాదిగ కిషోర్ మాదిగ మాదిగ శేఖర్ మాదిగ శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు బూర్గుల.. నేడు రేవంత్
[ 06-12-2023]
కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో పాలమూరు బిడ్డకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
సొంతూరు బలగం
[ 06-12-2023]
విజయం సొంతం చేసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న శాసనసభ విజేతల స్వగ్రామాల్లో ఆసక్తి నెలకొంది. నవంబరు 30న జరిగిన ఎన్నికల్లో ఆయా గ్రామాల్లోని ఓటర్ల మద్దతు లభించడం విశేషం. -
కాంగ్రెస్ వైపే ఉద్యోగుల మొగ్గు
[ 06-12-2023]
ఉమ్మడి మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కూడా కాంగ్రెస్కే జై కొట్టారు. పోస్టల్ బ్యాలెట్ వేసిన వారిలో 90 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. వీరిలో ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రయోగ కిట్ల జాడేది.?
[ 06-12-2023]
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ పాఠాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వాటిని ప్రయోగ పరికరాలతో బోధించడం, విద్యార్థులతో చేయించడం ప్రధానం. తద్వారా పాఠశాల నుంచే భావిభారత శాస్త్రవేత్తలుగా వారిని రూపుదిద్దడానికి అవకాశం ఉంటుంది. -
మార్కండేయతో మహర్దశ
[ 06-12-2023]
బిజినేపల్లి మండలం శాయిన్పల్లి వద్ద రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కండేయ ఎత్తిపోతల పనులు పూర్తవగా, నవంబర్ 18న నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. -
మూడోసారి
[ 06-12-2023]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుసగా రెండు సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎనిమిది ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకోవాలని ఆశించారు. ఓటర్లు వారి ఆశలను అడియాసలు చేస్తూ తీర్పును ఇచ్చారు. -
దొరికిన నగదు రూ.3.95 కోట్లు
[ 06-12-2023]
అక్టోబర్ 9న హన్వాడ ప్రాంతానికి ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మహబూబ్నగర్ పట్టణం పాత బస్టాండు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద లభించిన రూ.6లక్షల నగదుకు ధ్రువపత్రాలు చూపకపోవటంతో పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. -
శ్రీకురుమూర్తి హుండీ ఆదాయం రూ.27.47లక్షలు
[ 06-12-2023]
జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీకురుమూర్తిస్వామి క్షేత్రంలో హుండీని మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.27,47,855 ఆదాయం వచ్చినట్లు ఈవో మదనేశ్వర్రెడ్డి తెలిపారు. -
పంచాయతీ భవనాలు పూర్తయ్యేనా?
[ 06-12-2023]
గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం జనవరి నాటికి ముగుస్తుంది. కేవలం 55 రోజులు మాత్రమే ఉంది. పంచాయతీ భవనాల నిర్మాణం అప్పటిలోపు పూర్తయ్యేలా లేవు. -
కమ్ముకున్న మేఘాలు!
[ 06-12-2023]
మిగ్జాం తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రెండు రోజులుగా ఈదురు గాలులు.. కొద్దిపాటి జల్లులు పడటం, ఆకాశం మేఘాలతో కమ్ముకోవటంతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆహార పద్ధతులు పాటిస్తే మెరుగైన ఆరోగ్యం
[ 06-12-2023]
ప్రస్తుతం వాతావరణంలో మార్పులు సంభవించడంతో చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని డీఎంహెచ్వో జయచంద్రమోహన్ తెలిపారు. -
పనపర్తిలో వరుస విజయాలు ముగ్గురికే
[ 06-12-2023]
చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటి సారి జరిగిన ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు. -
పాలమూరులో ప్రభావం అంతంతే!
[ 06-12-2023]
శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నడిగడ్డకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముందుండి నడిపించినా ప్రజలు ఆదరించలేదు. -
మిరప రైతుల్లో ఆందోళన
[ 06-12-2023]
ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికి వచ్చిన సమయంలో తుపాన్తో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి అడపాదడపా ఆకాశం మేఘావృతం కావడం జల్లులు పడుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. -
ఈసారీ నలుగురే!
[ 06-12-2023]
శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సారి నలుగురు అభ్యర్థులు ఓట్ల లక్షాధికారులయ్యారు. 2018 ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులు ఈ ఫీట్ సాధించారు. కాకుంటే అప్పుడు సాధించిన వారు ఒక్కరూ ఈసారి ఎన్నికల్లో ఆ ఘనతను నిలుపుకోలేకపోయారు.


తాజా వార్తలు (Latest News)
-
Lionel Messi: టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా మెస్సీ
-
Websites: పార్ట్టైం జాబ్ మోసాలు.. 100కి పైగా వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
-
Hyderabad: సీఎం ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లు
-
ZestMoney: బీఎన్పీఎల్ స్టార్టప్ జెస్ట్మనీ మూత.. 150 మంది ఉద్యోగుల తొలగింపు
-
Team India: ధోనీలాంటి కెప్టెనే రోహిత్.. వారికి ఎల్లవేళలా అండగా ఉంటాడు: శ్రీశాంత్
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణ స్వీకార సమయంలో మార్పు