logo

అభిమానించే వారిని కాపాడుకుంటా: జగ్గారెడ్డి

తన నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్‌ ఎంపీపీలు, సర్పంచ్‌లు పార్టీ మారారని..

Published : 12 Jul 2021 11:25 IST

 

సంగారెడ్డి: తన నియోజకవర్గంలో కొందరు కాంగ్రెస్‌ ఎంపీపీలు, సర్పంచ్‌లు పార్టీ మారారని.. దీనిపై కార్యకర్తలు ఆందోళన చెందొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. పార్టీ మారిన వారిని తాను విమర్శించనని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ పార్టీ మారే వారి పరిస్థితి ఎలా ఉందో? వారు ఎందుకు మారుతున్నారో?అది వారి వ్యక్తిగతం. కార్యకర్తనే నాయకుడిగా తయారు చేస్తా. బలమైన నేతలు వెళ్లగానే ఓట్లు పోయానని భావించొద్దు. నన్ను అభిమానించే వారిని నేను కాపాడుకుంటా. కార్యకర్తలెవరూ మనోధైర్యం కోల్పోవద్దు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని