Crime News: సంగారెడ్డి జిల్లాలో 10క్వింటాళ్ల గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

Published : 30 Nov 2021 01:38 IST

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి లారీలో 10 క్వింటాళ్లు తీసుకొస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కంది గ్రామం వద్ద పోలీసులు ఆ లారీని ఆపి తనిఖీ చేయగా తుక్కు కింద గంజాయి మూటలు కనిపించాయి. దీంతో గంజాయిని సీజ్‌ చేసి దాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదనపు సమాచారం కోసం దర్యాప్తు ప్రారంభించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని