Family Suicide: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబం బలవన్మరణం
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి
సంగారెడ్డి పట్టణం: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలహాలతో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్ (38), లావణ్య (32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్(6), సర్వజ్ఞ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ శివారు బీహెచ్ఈఎల్లో నివాసముంటున్నారు. అక్కడికి సమీపంలోని బాంబే కాలనీలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికోసం లావణ్య తల్లిదండ్రులు రూ.40లక్షలు సహాయం చేశారు. చంద్రకాంత్కు వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణ పనులకే ఖర్చువుతుండటంతో ఇల్లు గడిచేందుకు ఇబ్బందులు తలెత్తాయి. ఎంతో కొంత సహాయం చేయాలని తన తల్లిదండ్రులను చంద్రకాంత్ కోరగా.. అందుకు వారు నిరాకరించారు.
కాగా.. గురువారం సాయంత్రం కుటుంబసభ్యుల గృహప్రవేశానికి చంద్రకాంత్ దంపతులు వెళ్లొచ్చారు. అనంతరం చంద్రకాంత్ తన తల్లిదండ్రులతో ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బుల విషయంలో గొడవపడ్డాడు. రోజూ దీనిపై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపం చెందిన లావణ్య.. పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం, గొడవల నేపథ్యంలో చంద్రకాంత్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బయటకు వెళ్లిపోయిన లావణ్య.. కాసేపటికి అనుమానం వచ్చి పక్కింటికి ఫోన్ చేయగా భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆమె.. ఇద్దరి పిల్లలతో సహా అందోల్ పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఉదయం చెరువులో మృతదేహాలు తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లావణ్యతో పాటు పిల్లల మృతదేహాలకు బయటకు తీశారు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!