logo

TS News: వివాహానికి గంట ముందు.. కట్నం డబ్బులతో వరుడు పరారీ

వివాహానికి గంట ముందు వరుడు పరారు కాగా.. పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై కె.సుభాష్‌, బాధిత

Updated : 16 Dec 2021 06:59 IST

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: వివాహానికి గంట ముందు వరుడు పరారు కాగా.. పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై కె.సుభాష్‌, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆగస్టు 27న వీరికి నిశ్చితార్థం జరిపించగా.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడికి కట్నం కింద ఇచ్చారు. ఈనెల 12న వివాహం చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో కల్యాణ మండపంలో వేదిక ఏర్పాటు చేశారు. వివాహానికి గంట ముందు కట్నం డబ్బులు, బంగారంతో వరుడు పారిపోయాడు. అనంతరం మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఊరు విడిచి వెళ్లారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలోనూ బుధవారం వధువు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని