తేలిపోయిన నాణ్యత..!
తూప్రాన్ ప్రధాన రహదారి విస్తరణ పనులు ముణ్నాళ్ల ముచ్చటగా మారాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించగా దశాబ్దాల కాలం వరకు మన్నిక ఉండాల్సిన రోడ్డు అప్పుడే నాణ్యత తేలిపోతోంది. పురపాలిక పరిధి కరీంగూడ నుంచి అయ్యప్ప ఆలయం వరకు రూ.7.90 కోట్లతో గతంలో పనులు చేపట్టి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు.
తూప్రాన్లో ప్రధాన రహదారి దుస్థితి
న్యూస్టుడే, తూప్రాన్
తూప్రాన్ ప్రధాన రహదారి విస్తరణ పనులు ముణ్నాళ్ల ముచ్చటగా మారాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించగా దశాబ్దాల కాలం వరకు మన్నిక ఉండాల్సిన రోడ్డు అప్పుడే నాణ్యత తేలిపోతోంది. పురపాలిక పరిధి కరీంగూడ నుంచి అయ్యప్ప ఆలయం వరకు రూ.7.90 కోట్లతో గతంలో పనులు చేపట్టి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు. ఆ సమయంలో అధికారులు సరిగా పర్యవేక్షించకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారం పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 44వ జాతీయ రహదారి వైపు నుంచి పట్టణంలోకి వచ్చే దారిలో కరీంగూడ, రావెళ్లి సమీపంలో భారీ గుంతలతో వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. పోతరాజ్పల్లి వద్ద తూప్రాన్కు వచ్చే దారిలో రోడ్డు పూర్తిగా అతుకులమయంగా తయారైంది. రోడ్డు వేసే సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కాల్వల మాదిరిగా ఏర్పడ్డాయి. దీంతో వర్షం కురిసినప్పుడల్లా నీళ్లు నిలిచి ద్విచక్ర వాహన చోదకులు అదుపుతప్పి కింద పడుతున్నారు. ఇక్కడ వంద మీటర్ల మేర ఇదే పరిస్థితి ఉన్నా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఈ రహదారిపై ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సంగారెడ్డి వైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విభాగిని వద్ద రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాల్సి ఉండగా వాటిని అప్పటి నుంచి అలానే వదిలేశారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది తూప్రాన్ ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంత. డివిజన్ కేంద్రంలో మూడేళ్ల క్రితం రూ.కోట్లు వెచ్చించి రహదారి నిర్మించగా అప్పుడే గుంతలు ఏర్పడుతున్నాయి. పట్టణంలోని గీతారెడ్డి కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై రెండేళ్లుగా ఈ గుంత ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. రాత్రిళ్లు గుంత కనిపించక వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
మరమ్మతులు చేయిస్తాం..
- శ్రీనివాస్, డీఈ, ర.భ.శాఖ, తూప్రాన్
తూప్రాన్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు త్వరలో మరమ్మతులు చేయిస్తాం. మొదటిసారి పనులు చేసిన గుత్తేదారు రెండేళ్ల వరకు మాత్రమే మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక నిధులతో మరో గుత్తేదారుతో మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం. ఫిబ్రవరి రెండో వారంలోపు పనులు పూర్తి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తగతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
ద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం