పురుగు మందు తాగి ఒకరు...
పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు
టేక్మాల్, న్యూస్టుడే: పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా టేక్మాల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తితో ఈనెల 16వ తేదీన అతనికి గొడవ జరిగింది. గొడవలో సదరు వ్యక్తికి గాయాలవగా ఆయన వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాదయ్యపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జి టేక్మాల్కు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ తర్వత రిమాండ్కు తరలిస్తారని మనస్తాపానికి గురయ్యాడని, దీంతో రెండు రోజులుగా యాదయ్య ఇంటి వద్దే దిగాలుగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యాదయ్య టేక్మాల్ చిన్న చెరువు సమీపంలో పురుగు మందు తాగి అక్కడే పడిపోయాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి తాను పురుగు మందు తాగానని తెలపడంతో, వెంటనే అక్కడికి స్థానికులు చేరుకుని చికిత్స నిమిత్తం అతన్ని టేక్మాల్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ యాదయ్య మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు