సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు పాలనాధికారి రమేశ్ సూచించారు. బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో సంఘం నూతన సంవత్సర దైనందిని, కాలమానిని అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
మెదక్, న్యూస్టుడే: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదనపు పాలనాధికారి రమేశ్ సూచించారు. బుధవారం స్థానిక టీఎన్జీవో భవనంలో సంఘం నూతన సంవత్సర దైనందిని, కాలమానిని అదనపు పాలనాధికారిణి ప్రతిమాసింగ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. టీఎన్జీవోతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, జిల్లాలో ఉద్యోగుల సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జీవో 317 ప్రకారం ఉద్యోగుల స్థానిక కేడర్ల కేటాయింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికి కష్టపడి పనిచేసిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులను ఆమె అభినందించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మాట్లాడుతూ.. సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ గత ఏడేళ్లుగా అనేక సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. జీవో 317తో ఉద్యోగుల కేటాయింపులో కొంత ఇబ్బంది జరిగింది వాస్తవమేనని, త్వరలో అన్ని సమస్యలు తొలగిపోతాయన్నారు. భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, సహ అధ్యక్షుడు సాదిక్ అలీ, ఉపాధ్యక్షులు అనురాధ, మనోహర్, ఫణిరాజ్, ఇక్బాల్పాష, అర్షద్, ఫజల్, బాధ్యులు శంకర్, కోటి రఘునాథ్రావు, చిరంజీవాచార్యులు, వినోద్, శేషాచారి, శ్రీనివాస్గౌడ్, ప్రభాకర్, శంకర్గౌడ్, రామాగౌడ్, విజయ్కుమార్, యాదగిరి, శ్రీనివాస్, సలావుద్దీన్, మంజుల, మెర్సీనా, సంతోష్, గాంధీ, గణేశ్, శేఖర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా