వనదుర్గమ్మ చెంతన చోరీ
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు గర్భగుడిలోకి ప్రవేశించి.. హుండీని ధ్వంసం చేసి రూ.80 వేలకు పైగా అపహరించాడు. స్థానిక పోలీసులు, ఆలయ ఈవో తెలిపిన వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు వనదుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో గర్భాలయం కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించాడు. అక్కడి హుండీ తాళాన్ని బద్దలు కొట్టి... భక్తులు
గర్భగుడి హుండీ నుంచి రూ.80 వేలకు పైగా అపహరణ
తొలగించిన కిటికీ ఇలా..
మెదక్, పాపన్నపేట, న్యూస్టుడే: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగుడు గర్భగుడిలోకి ప్రవేశించి.. హుండీని ధ్వంసం చేసి రూ.80 వేలకు పైగా అపహరించాడు. స్థానిక పోలీసులు, ఆలయ ఈవో తెలిపిన వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు వనదుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో గర్భాలయం కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించాడు. అక్కడి హుండీ తాళాన్ని బద్దలు కొట్టి... భక్తులు సమర్పించిన కానుకలతో పాటు నగదు ఎత్తుకెళ్లాడు. గురువారం తెల్లవారుజామున అర్చకులు రోజు మాదిరిగానే ఆలయానికి వచ్చి పూజాకార్యక్రమాలు మొదలుపెట్టే క్రమంలో ధ్వంసమైన కిటికీ, దెబ్బతిన్న హుండీని గమనించి.. ఈవో శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అదనపు ఎస్పీ డా.బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ టౌన్ సీఐ వెంకటయ్య, హవేలి ఘనపూర్, కొల్చారం ఎస్ఐలు సంతోష్కుమార్, శ్రీనివాస్ గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. గర్భగుడిలో చోరీ జరిగిన తీరు సీసీ కెమెరాలో నమోదైంది.
సీసీ కెమెరాలో నిక్షిప్తమైన నిందితుడి చిత్రం
పలుమార్లు విఫలయత్నం..
ఆగంతుకుడు ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న ఇనుప గ్రిల్ తాళాన్ని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఎడమవైపు ఉన్న కిటికీని ధ్వంసం చేసేందుకు యత్నించినా సాధ్యపడకపోవడంతో కుడి వైపు కిటికీని విరగొట్టి.. గర్భాలయం లోకి ప్రవేశించాడు. అక్కడ హుండీ తాళాన్ని పగలగొట్టి కానుకలు, నగదును సంచిలో మూటకట్టుకున్నాడు. తర్వాత పక్కనే ఉన్న మరో హుండీ తాళాన్ని పగలగొట్టేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో అమ్మవారికి మొక్కుకుని అక్కడి నుంచి నిష్క్రమించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఎత్తుకెళ్లినట్లు ఈవో పేర్కొన్నారు. గతనెల 6న (66 రోజులకు) ఆలయ హుండీని లెక్కించగా రూ.35.82 లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కొల్లగొట్టిన హుండీ తెరవక బుధవారానికి 44 రోజులు. ఆదాయం కూడా భారీగా ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడు పట్టుబడితే కానీ ఏమాత్రం చోరీ అయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆలయ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
హుండీని పరిశీలిస్తున్న డీఎస్పీ సైదులు, మెదక్ టౌన్ సీఐ వెంకటయ్య, ఆలయ ఈవో శ్రీనివాస్
పోలీసులు ఏమయ్యారు..
ఏడుపాయల పరిసరాల్లో కొద్దినెలల కిందట పోలీసు ఔట్పోస్టు ఏర్పాటు చేశారు. నాగ్సాన్పల్లి నుంచి ఆలయానికి వచ్చే దారిలో ఆర్డబ్ల్ల్యూఎస్కు చెందిన గదుల్లో నిత్యం ఇద్దరు నుంచి ముగ్గురు బందోబస్తులో ఉంటున్నారు. ఆలయానికి 500 మీటర్లలో ఔట్పోస్టు ఉంది. విధుల్లో ఉన్న పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాల్సి ఉండగా ఏమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో అర్ధరాత్రి ఆగంతకుడు దర్జాగా వచ్చి చోరీకి పాల్పడ్డాడు. ప్రధాన ఆలయం వద్ద రాత్రివేళ కాపలా ఉంటున్న శివయ్య బుధవారం రాత్రి అనారోగ్య కారణంతో రాజగోపురం వద్ద నిద్రించినట్లు పోలీసులకు వివరించాడు. ఈ విషయమై అదనపు ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ.. నిందితుడి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయని వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టామని. వీలైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
మూడోసారి...
ఏడుపాయల్లో దొంగతనం జరగడం ఇది మూడోసారి. కొన్నేళ్ల కిందట ఆలయం ముందు భాగంలో రెండుసార్లు చోరీకి పాల్పడగా.. ప్రస్తుతం ఏకంగా గర్భగుడిలోకి వెళ్లి హుండీని ధ్వంసం చేసి నగదు, కానుకలు ఎత్తుకెళ్లాడు. ఆలయానికి ఆశించిన స్థాయిలో భద్రత లేదని ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదించినా ఫలితం లేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
దివ్యమైన ఓటుకు సాక్ష్యం
[ 20-04-2024]
సాక్ష్యం యాప్లో దివ్యాంగులకు అవసరమైన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అది ఏ స్థాయిలో ఉందో ఆరా తీయవచ్చు. -
కలెక్టరేట్ కేంద్రంగా కీలక విభాగాలు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.