logo

చికిత్స పొందుతూ యువకుడి మృతి

భూ వివాదం నేపథ్యంలో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపిన

Published : 21 Jan 2022 02:12 IST

చేగుంట, వెల్దుర్తి, న్యూస్‌టుడే: భూ వివాదం నేపథ్యంలో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. మాసాయిపేట మండలం రామంతాపూర్‌ తండాకు చెందిన ఆముగోతు కిషన్‌కు ఇద్దరు కుమారులు. వారి ఇంటి ఎదురుగా ఎకరం వ్యవసాయ భూమి ఉండగా న్యాయస్థానంలో వివాదం నడుస్తుండగా వారి పెద్ద కుమారుడు రమేష్‌ (27) ఆ విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఏళ్లు గడచినా వివాదం పరిష్కారం కావడం లేదని మనస్తాపం చెందిన అతను ఈనెల 18న ఆత్మహత్య చేసుకునేందుకు చేగుంట బస్టాండ్‌ సమీపంలో పురుగుమందు తాగాడు. విషయాన్ని చరవాణి ద్వారా తమ్ముడు నరేష్‌కు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అపస్మారక స్థితికి చేరిన రమేష్‌ను తొలుత చేగుంటలో ప్రైవేటు ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. మృతుడి తండ్రి కిషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని