logo

ఉపసర్పంచి, ఆరుగురు యువకుల పరారీ

మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలో జిన్‌గుర్తికి  చెందిన ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించారు. జిన్‌గుర్తి ఉపసర్పంచి ఆశం అలీతోపాటు మరో ఆరుగురు యువకులు  పరారీలో

Published : 21 Jan 2022 02:12 IST

జిన్‌గుర్తి (తాండూరు గ్రామీణ), న్యూస్‌టుడే: మద్యం మత్తులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలో జిన్‌గుర్తికి  చెందిన ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించారు. జిన్‌గుర్తి ఉపసర్పంచి ఆశం అలీతోపాటు మరో ఆరుగురు యువకులు  పరారీలో ఉన్నారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఐదు రోజుల క్రితం ఏఎస్‌ఐ కమాల్‌రెడ్డి సారథ్యంలో ముగ్గురు కానిస్టేబుళ్లు గ్రామానికి వెళ్లగా సర్పంచితోపాటు ఎనిమిది మంది యువకులు మద్యం మత్తులో ఉన్నారు. కానిస్టేబుల్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి చొక్కా కాలర్‌ పట్టుకుని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు.  ఈ ఘటనలో పాల్గొన్న తొమ్మిది మందిపై కేసు నమోదు  చేయగా పరారీలో ఉన్న ఏడుగురిని త్వరలో పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని