పంట వ్యర్థం.. కాల్చితే అనర్థం
జిల్లాలో వానాకాలం పంట చేతికందగానే రైతులు వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఎలాంటి ఖర్చులేకుండా తదుపరి పంట వేసుకోవచ్చని, ఆ బూడిద తర్వాత పంటకి కాస్త ఎరువుగా
కుళ్లిస్తే భూమి సారవంతం
తగులబెట్టిన తరువాత వరి పొలాలు
నారాయణఖేడ్ టౌన్, న్యూస్టుడే: జిల్లాలో వానాకాలం పంట చేతికందగానే రైతులు వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేయడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఎలాంటి ఖర్చులేకుండా తదుపరి పంట వేసుకోవచ్చని, ఆ బూడిద తర్వాత పంటకి కాస్త ఎరువుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. కానీ ఇది వాతావరణంతో పాటు చేనుకు ఎంత ప్రమాదకరమో తెలుసుకోలేకపోతున్నారు. కాల్చి వేతతో కలిగే అనర్థాలు, వ్యర్థాల పునర్వినియోగంతో కలిగే ప్రయోజనాలపై ‘న్యూస్టుడే’ కథనం...
అని విధాలా చేటే...
దేశ జనాభాలో దాదాపు 85 శాతం ప్రజల ఆయు ప్రమాణం ఏడేళ్లు తగ్గడానికి వాయు కాలుష్యం కారణమవుతోందని చికాగో విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. టన్ను గడ్డి కాల్చడం వల్ల నేలలోని 12 కిలోల యూరియా, 41 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 16 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, సల్ఫర్ వంటి పోషకాలు నష్టపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పంట వేడితో సెం.మీ.లోతు వరకు పోషకాలకు నష్టం వాటిల్లుతోంది. పంట ఎదుగుదలకు దోహదం చేసే మిత్ర పురుగులు 50 శాతానికి పై నశిస్తాయి. ప్రమాదవశాత్తు రూ. లక్షల విలువ చేసే వ్యవసాయ పరికరాలతో పాటు ఇతర పంటలు దగ్ధమవుతున్నాయి. రైతులు సైతం మృత్యువాత పడిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.
యంత్రాలనే వాడారు
వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపుగా 60 శాతానికి మించి పంటను యంత్రాలతో నూర్పిడి పూర్తి చేశారు. ఇది సేకరణకు పనికి రాదని కాల్చేస్తున్నారు. మిగిలిన దాంట్లో 50 శాతం మంది మాత్రమే గడ్డిని భద్రపరుస్తారు. పెసర, మినుము వంట పంటలు కూడా పంట నూర్పిడి అనంతరం దహనం చేస్తున్నారు.
* గతంలో రైతులు పంటలను నిదానంగా కోసేవారు. దీంతో 1 సెం.మీ. నుంచి 2 సెం.మీ.ల గడ్డి మాత్రమే నేలలో మిగిలేది. పశుగ్రాసం కూడా లభించేది. దున్నినా, తగలబెట్టినా తక్కువ కాలుష్యం జరిగేది. ఇటీవలి కాలంలో యంత్రాల సహాయంతో పంట కోతలు జరుగుతున్నాయి. వీటివల్ల నేలపై 6 సెం.మీ. నుంచి 10 సెం.మీ.ల గడ్డి మిగులుతుంది. ఇలాంటి వాటిని కాల్చటం వల్ల ఎక్కువ కాలుష్యం ఉత్పన్నమవుతోంది. పంట కాలుష్యం పూర్తి కావటం, రుతుపవనాలు మందగించటం ఒకేసారి జరగటం వల్ల కాలుష్యం వేగంగా వ్యాపిస్తుంది. సాధారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో పంట కోసిన తర్వాత పంట మొక్కల అవశేషాలు మిగులుతాయి. వ్యవసాయ క్షేత్రాల్లోనే దున్నటం వల్ల అవి నేలలో గల వివిధ రకాల సూక్ష్మజీవుల చర్యల వల్ల కుళ్లి నేలలోకి చేరటం వల్ల సారవంతమవుతుంది.
బహళ ప్రయోజనాలు: శ్రీనివాస్రెడ్డి వ్యవసాయాధికారి, మనూరు
పంటల వ్యర్థాలను పునఃవినియోగిస్తే ప్రయోజనాలుంటాయి. భూమిని సారవంతం చేసుకోవచ్చు. వాటినుంచి నత్రజని, భాస్వరం, పొటాష్లు పంటలకు అందించవచ్చు. విచక్షణ రహితంగా వస్తువులను గానీ, పంట పొలాల్లో మిగిలిన అవశేషాలను గానీ కాల్చ కూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..