పొదుపుగా ఇంధన వనరుల వినియోగం
ఇంధన వనరులను పొదుపుగా వాడుకొని భావితరాలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం అక్కన్నపేట మండల పరిషత్తు
ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్
ఫ్యాన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, తదితరులు
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం: ఇంధన వనరులను పొదుపుగా వాడుకొని భావితరాలకు అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం అక్కన్నపేట మండల పరిషత్తు కార్యాలయంలో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(రెడ్కో) ఆధ్వర్యంలో రాయితీపై గిరిజనులకు ఇచ్చిన సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ ఫ్యాన్లు బహిరంగ విపణిలో ఒక్కోటి రూ.2500 ఉండగా రెడ్కో కేవలం రూ.500 అందిస్తోందన్నారు. 14 గ్రామాలకు గాను 271 మందికి పంకాలు పంపిణీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు రామేశ్వర్రావు, రాజేశ్వర్రావు తెలిపారు. అవకాశాన్ని గిరిజనులు వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధ పడుతున్న అక్కన్నపేటలో కోనేటి రాజు, గొల్లకుంటలో నార్లపురం సదానందంతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన జంగపల్లి శ్రవణ్కుమార్, గాంధీనగర్లో సటికం వెంకటయ్య, మోత్కులపల్లిలో అందె ఓదెలు, రావుల యాదయ్య కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.అక్కన్నపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన పెట్రోల్బంకును సందర్శించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా మంగ, ఎంపీడీవో సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ సంజీవ్కుమార్, సర్పంచి ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, తెరాస మండల అధ్యక్షులు పెసరి సాంబరాజు, వంగ వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండల్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు వెల్ది శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హస్త’గతం చేసుకోవాలని..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. -
నిందితులను అరెస్టు చేయండి
[ 20-04-2024]
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు -
ఓటు నమోదుకు కదిలిన యువత
[ 20-04-2024]
కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. -
పక్కాగా నిఘా
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అక్రమంగా నగదు తరలిస్తున్నారా, మద్యం తీసుకెళ్తున్నారా నిఘా వేసి ఉంచారు -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
[ 20-04-2024]
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ప్రచార రథం ఢీకొని రైతు మృతి చెందాడు. -
పాము కాటుతో బాలుడి మృతి
[ 20-04-2024]
పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. -
రెండో రోజు.. ముగ్గురు స్వతంత్రుల నామినేషన్లు
[ 20-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు -
సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగండ్ల వానతో అతలాకుతలం
[ 20-04-2024]
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. -
‘కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితం ఆగం’
[ 20-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసం, కష్టాలమయమని.. ఆటో కార్మికుల జీవితాలు ఆగమవడం అందుకు నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
రెండో రోజు 4 నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా వెలుగు పార్టీ నుంచి యాదగిరిగౌడ్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గొల్లపల్లి సాయగౌడ్, స్వతంత్ర అభ్యర్థులుగా బొమ్మల విజయ్కుమార్, తుమ్మలపల్లి పృథ్విరాజ్ నామినేషన్ వేశారు. -
ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
[ 20-04-2024]
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు