ఆరోగ్య భాగ్యం.. అందరికీ అవసరం
‘అన్నీ ఉన్నా... ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏం లాభం. అందుకే ‘ఆరోగ్యమే మహా భాగ్యమని’ పెద్దలు అన్నారు. పూర్వ కాలంలో ఇంటిల్లిపాదీ శారీరకంగా శ్రమించే వారు. అందువల్ల 60 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమంలో యాంత్రీకరణ
వ్యాయామం, యోగా అలవాటుగా మారాలి
కరోనా వేళ ఇంటినుంచీ చేయవచ్చని వైద్యుల సూచన
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, సిద్దిపేట టౌన్, మెదక్, వికారాబాద్ మున్సిపాలిటీ
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపాన పార్కులో నడక
‘అన్నీ ఉన్నా... ఆరోగ్యం సరిగా లేకపోతే... ఏం లాభం. అందుకే ‘ఆరోగ్యమే మహా భాగ్యమని’ పెద్దలు అన్నారు. పూర్వ కాలంలో ఇంటిల్లిపాదీ శారీరకంగా శ్రమించే వారు. అందువల్ల 60 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమంలో యాంత్రీకరణ పెరిగింది. శారీరక శ్రమ తగ్గింది. దీంతో చిన్న వయసులోనే షుగరు, బీపీ వంటివి దాడి చేస్తున్నాయి. అంతేకాదు పనిఒత్తిడి పెరిగి మానసికంగా ఆందోళన తప్పడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు పెద్దవారు, యువత ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులకు, జిమ్లకు వెళ్లి వ్యాయామం చేయడం... యోగా సాధన.. అలవాటుగా మార్చుకున్నారు. కరోనా కారణంగా మూడేళ్లుగా జిమ్లు, యోగా కేంద్రాలకు వెళ్లే అలవాటు తప్పింది. ఇప్పుడు కూడా కరోనా మూడోదశ వ్యాపిసోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య రక్షణకు, శారీరక పటుత్వానికి యోగా, వ్యాయామం అలవాటు చేసుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. అలవాటు ఉన్నవారు మానకుండా ఇంటినుంచీ చేయవచ్చని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
పల్లెల్లోనూ ఆసక్తి
కరోనా కారణంగా ఆరోగ్యం విషయంలో మారుమూల పల్లెల్లోనూ ప్రజల ఆలోచనా ధోరణి మారింది. ఆరోగ్యానికి, మంచి ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మెదక్, సంగారెడి, సిద్దిపేట జిల్లాల్లోని తండాలలోని యువత, పెద్దలు ఉదయం, సాయంత్రం కచ్చితంగా నడకతోపాటు వ్యాయామంపై దృష్టి సారిస్తున్నారు.
పట్టణాల్లో నిత్య కార్యక్రమం
సిద్దిపేట, వికారాబాద్, పరిగి, తాండూరు, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల్ పట్టణాల్లో కరోనా రాకముందు అత్యధికంగా యువత వ్యాయమ శాలలకు నిత్యం వెళ్లేవారు. ఇక వృద్ధులు, నడి వయసు వారు ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులకు, క్రీడా ప్రాంగణాలకు వెళ్లేవారు. వికారాబాద్లోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఉదయం, సాయంత్రం వేళల్లో నేటికీ వృద్ధులు, యువత, పెద్దలు నడక కార్యక్రమానికి కొనసాగిస్తున్నారు.
ఇవీ లాభాలు...
* నడక, ఇతర వ్యాయామ సాధన వల్ల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
* మలబద్ధకం, అధిక బరువు, తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. బీపీ, షుగుర్ బారిన తొందరగా పడరు. మహిళలకు గర్భస్రావం నివారించడానికి దోహదం చేస్తుంది. కండరాలకు మరింత బలాన్ని చేకూరిస్తుంది.
* యోగ సాధనలో భాగంగా ప్రతి రోజూ సూర్య నమస్కారాలు తప్పనిసరి. ప్రాణాయామం ఆసనం కింది ఒక నాసిక నుంచి బాగా గాలిని లోపలికి తీసుకుని మరో నాసికా రంధ్రం ద్వారా వదలాలి. ఇలా రోజూ కనీసం 20 నిమిషాలు చేస్తే ఉపిరితిత్తులు బలంగా మారుతాయి.
* యోగాతో కంటిచూపు సమస్యలు తగ్గుతాయి. నరాలకు విశ్రాంతి లభించి మానసికంగా ఉల్లాసంగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడిలేమి సమస్య తగ్గుతుంది.
జాగ్రత్తలూ పాటించాలి
- పరశురాం, జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు, సంగారెడ్డి..
శారీరక సామర్థ్యం కోసం యోగా, వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అనిచెప్పి అదే పనిగా వ్యాయామం చేయడం, కషాయాలు తాగడం వంటివి చేయకూడదు. తద్వారా అసలుకే మోసం వస్తుంది. కాబట్టి పరిమిత సమయం కేటాయించాలి.
మానసిక, శారీరక పటుత్వం పెరుగుతుంది
- డాక్టర్ జీవరాజ్, జిల్లా ఉప వైద్యాధికారి, వికారాబాద్
కరోనా దరిచేరకుండా ఆరోగ్య రక్షణ అనే కాకుండా శారీరక పటుత్వానికీ చిన్నపాటి శారీరక కసరత్తులు రోజూ చేయాలి. దీంతోపాటు యోగాలోని కొన్ని సులువైన ఆసనాలను ఇంటినుంచే చేయవచ్చు. తద్వారా మానసికంగా, శారీరకంగా పటుత్వం పెరుగుతుంది.
రోగ నిరోధ శక్తిని పెంచే సాధనం.. యోగా
- శ్రీనివాస్రెడ్డి, యోగా గురువు, వికారాబాద్
అనాదిగా ఆరోగ్య పరంగా యోగాకు గుర్తింపు ఉంది. కరోనా పరిస్థితుల్లో దీనికి మరింది ప్రాధాన్యం పెరిగింది. యోగాసనాలు వేయటం వల్ల సుదీర్ఘ వ్యాధులు సైతం నయం అవుతాయి. ఎందుకంటే అంతర్గత కణాలు, నరాలలో పటుత్వం పెంచి వ్యాధులను దరిచేరనీయకుండా చేస్తుంది. యోగా స్వయంగా సాధన చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్