7,030 మంది వైరస్ అనుమానితులు
కరోనా వైరస్ చాప కింద నీరులా తీవ్రరూపం దాల్చుతోంది. మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనెల 21న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం
ఇంటింటి సర్వేలో వెల్లడి
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: కరోనా వైరస్ చాప కింద నీరులా తీవ్రరూపం దాల్చుతోంది. మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనెల 21న వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం నుంచి జిల్లాలో బృందాలు సర్వేకు ఉపక్రమించాయి. ఈ సర్వేను ఈనెల 22వ తేదీ లోపు పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి ఎం.హనుమంతరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సర్వే ముగిసిందా.. నిరంతరం కొనసాగుతుందా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, బిల్ కలెక్టర్లు, రిసోర్స్ పర్సన్లు, మహిళా సమాఖ్య సభ్యులు బృందాలుగా ఏర్పడి ఇంటింటా ఉదయం నుంచి రాత్రి వరకు జ్వర సర్వే చేశారు. కరోనా లక్షణాలు కలిగిన అనుమానితుల వివరాలు నమోదు చేసుకోవడమే కాకుండా.. వారికి కరోనా మందుల కిట్లు ఉచితంగా అందించారు. నాలుగు రోజుల తర్వాత ఆరోగ్యం కుదుట పడకుంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.
కరోనా @ 99
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో శనివారం 99 మంది వైరస్ బారిన పడినట్లు ఇన్ఛార్జి వైద్యాధికారిణి గాయత్రీదేవి తెలిపారు. యాంటిజెన్ పరీక్షల్లో 1541 మంది నమూనాలు సేకరించగా 65 మందికి, ఆర్టీపీసీఆర్లో 159 మందిని పరీక్షించగా 34 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటించారు. బాధితుల్లో పటాన్చెరులో 35 మంది, సంగారెడ్డిలో 25, జహీరాబాద్లో 15, నారాయణఖేడ్లో 15మంది, బొల్లారం, కంది, గుమ్మడిదలలో ఇద్దరికి చొప్పున ఆరుగురు, రామచంద్రాపురంలో (జీహెచ్ఎంసీ)ముగ్గురు ఉన్నట్లు వివరించారు. అందరూ హోంఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
జిల్లాలో శనివారం 15,642 మందికి కరోనా టీకా పంపిణీ చేశామని జిల్లా ఇన్ఛార్జి వైద్యాధికారిణి తెలిపారు. పీహెచ్సీల స్థాయిలో 3,739, ఆరోగ్య ఉప కేంద్రాల్లో 9,300, పురపాలక పరిధిలో 1,322, 15-18 ఏళ్ల వయస్సుల వారిలో 1,014, బూస్టర్ డోస్ 267 మందికి టీకా ఇచ్చామని ఆమె వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.