జోరుగా గజ్వేల్ రైల్వేస్టేషన్ విస్తరణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైల్వేస్టేషన్ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు రైళ్లు నిలబడేలా పట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జనరేటర్లు రప్పించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవటంతో స్టేషన్ ఆవరణం
నాలుగు రైళ్లు నిలబడేలా ట్రాక్ల నిర్మాణం
కొనసాగుతున్న పనులు
న్యూస్టుడే, గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైల్వేస్టేషన్ విస్తరణ పనులు చకచకా సాగుతున్నాయి. ఒకేసారి నాలుగు రైళ్లు నిలబడేలా పట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక జనరేటర్లు రప్పించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవటంతో స్టేషన్ ఆవరణం దుమ్ముకొట్టుకుపోవటంతో అన్నింటినీ సరి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను రప్పించి పనులు చేయిస్తున్నారు. గూడ్స్ రైళ్లను నడిపేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్- కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈమేరకు మనోహరాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం, రాయపోల్ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్ పట్టణం వరకు మూడు స్టేషన్ల నిర్మాణంతోపాటు 31 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించారు. ఆరు చోట్ల ఫ్లైఓవర్లు, మరో మూడు చోట్ల అండర్ బ్రిడ్జీలు నిర్మించారు. 2020, జూన్ 18న రైల్వే భద్రతా కమిషన్ బృందం తనిఖీలు ముగిశాక అధికారులు కొబ్బరికాయ కొట్టి రైలు సేవలును లాంఛనంగా ప్రారంభించారు.
అధికారికంగా చేపట్టినా..
2020, ఆగస్టు 26న అధికారికంగా గజ్వేల్కు రైలు సేవలు ప్రారంభమైనట్లేనని అధికారులు ప్రకటించారు. కానీ కరోనా కారణంగా సేవలు అందుబాటులోకి రాకపోవటంతో రైలు కల ఈప్రాంత వాసులకు సాకారం కాలేదు. ఈక్రమంలో విస్తరణ పనులు కొనసాగుతుండటంతో త్వరలోనే రైలు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ (నాంపల్లి), సికింద్రాబాద్ స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వేశాఖ గజ్వేల్పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో రింగు రోడ్డుకు చేరువలో గజ్వేల్ ఉండటంతో రాజధానిలోని రైల్వేస్టేషన్లకు ప్రత్యామ్నాయంగా ఇక్కడి స్టేషన్ను తీర్చిదిద్ది.. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచే రైళ్లను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్టేషన్లో ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన జనరేటర్లు
నాలుగు దశల్లో..
మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్ల మేర రూ.1160.47 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టును నాలుగు దశల్లో నిర్మిస్తున్నారు. తొలి దశలో మనోహరాబాద్-గజ్వేల్ మధ్య 31 కిలోమీటర్లు రైలు నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ మార్గం నిర్మాణానికి 2017, మార్చి 14న గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తయ్యాయి. రెండో దశ పనుల్లో భాగంగా గజ్వేల్- దుద్దెడ (33 కిమీ) మధ్య పట్టాల బిగింపు, వంతెనల నిర్మాణం కొనసాగుతోంది. తొలుత రైలు సేవలను హైదరాబాద్ కాచిగూడ-గజ్వేల్ మధ్య అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్