బడి బయట పిల్లలు.. చేరేలా!
బడి బయట పిల్లలను గుర్తించి ప్రవేశాలు (నమోదు) కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఈనెల 12 నుంచి మొదలైన సర్వే 25వ తేదీతో ముగియనుంది. ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ (ఓఓఎస్సీ) పేరిట నిర్వహించే ఈ కార్యక్రమం
ఈనెల 25తో ముగియనున్న సర్వే
న్యూస్టుడే, సిద్దిపేట టౌన్: బడి బయట పిల్లలను గుర్తించి ప్రవేశాలు (నమోదు) కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఈనెల 12 నుంచి మొదలైన సర్వే 25వ తేదీతో ముగియనుంది. ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ (ఓఓఎస్సీ) పేరిట నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా 6 - 14 ఏళ్లు, 15 - 19 ఏళ్ల వయసున్న వారిని గుర్తించి వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి పాఠశాల వైపు అడుగులు వేయించనున్నారు. అవసరం మేర ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి తర్ఫీదు ఇవ్వనున్నారు.
బాలల పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష నేతృత్వంలో ఓఓఎస్సీ సర్వే నిర్వహిస్తున్నారు. గత ఏడాది జనవరిలో సర్వే నిర్వహించగా.. బడీడు పిల్లలు 258 మందిని గుర్తించి.. చేర్పించారు. స్థాయిలను పెంపొందించేందుకు 11 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కేటాయించారు. గత ఏడాది నవంబరులో శిక్షణ మొదలు కాగా ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. నాలుగు నెలల వ్యవధిలో విద్యార్థులను పాఠశాల స్థాయికి చేరుకునేలా శిక్షణ అందిస్తారు. మరోవైపు ఏటా సర్వేలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, ఇతర చోట్ల సీఆర్పీలు సమాచారం సేకరించి అనుగుణంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ సారి జిల్లాలో 104 మంది సీఆర్పీలు భాగస్వాములయ్యారు. పది రోజుల వ్యవధిలో పాఠశాలల్లో నమోదవని 92 మంది బాలబాలికలను గుర్తించారు. అందులో 6-14 ఏళ్ల వయసున్న వారు 89 మంది, 15-19 ఏళ్ల వారు ముగ్గురు ఉన్నారు.
రెండేళ్లుగా ఊసేలేదు..
జిల్లాలో ప్రాజెక్టులు, వివిధ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా, బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి ఏటా వందల సంఖ్యలో కార్మికులు.. కుటుంబ సభ్యులతో సహా తరలివస్తున్నారు. అక్టోబరు, నవంబరులో వలస వచ్చే వారంతా.. పిల్లలను బడికి పంపించడం లేదు. ఫలితంగా నిరక్షరాస్యులుగా మారుతున్నారు. వారిని సర్వేలో గుర్తిస్తున్నారు. పని ప్రదేశాల్లో యజమానుల సహకారంతో తాత్కాలిక పాఠశాల ఏర్పాటు చేసి విద్యా వాలంటీర్లను నియమించి తరగతులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సర్వే దోహదం చేయనుందని అధికారులు చెబుతున్నారు. 2019-20 వరకు వర్క్సైట్ పాఠశాలలు నడిచారు. అప్పట్లో పది పని ప్రాంతాల్లో పాఠశాలలు ఉండగా.. 200 మందికి విద్యాబుద్ధులు నేర్పించారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. దీంతో పలువురు బాలలు నిరక్షరాస్యతను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సర్వే ప్రక్రియ పకడ్బందీగా కొనసాగితే.. బాల కార్మికుల సంఖ్యను తగ్గించవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్