కొమురవెల్లిలో యువకుడుఆత్మహత్య
కొమురవెల్లి మండల కేంద్రంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లికి చెందిన బూర్గుల వెంకటేశ్(32) ఇంట్లో ఎవరూలేని సమయంలో
చేర్యాల, న్యూస్టుడే: కొమురవెల్లి మండల కేంద్రంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లికి చెందిన బూర్గుల వెంకటేశ్(32) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఇంజినీరింగ్ చదివి బిల్డరుగా జీవనం సాగిస్తున్న అతడు గత ఏడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్నాడని ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. ‘చేతికొచ్చిన పనులు చేజారుతున్నాయని, చేస్తున్న పనులు మరిచిపోతున్నానని, బతకాలని లేదని, చనిపోతున్నా..’ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కొమురవెల్లి ఏఎస్సై అంజయ్య తెలిపారు.
చెరువులో దూకి వృద్ధుడి బలవన్మరణం
కొండపాక, న్యూస్టుడే: రెండేళ్ల కిందట చనిపోయిన భార్య మరణం ఆయన్ను మద్యానికి బానిసగా మార్చింది. ఇక భరించడం నా వల్ల కాదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ నాలుగైదు రోజులుగా చుట్టుపక్కల వారితో చెబుతూ వస్తుండగా చివరికి అన్నంత పనిచేశాడు. కొండపాక మండలం దమ్మకపల్లిలో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో గుమ్మడిదల బిక్షపతి (72) అనే వృద్ధుడు మల్లంకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. దమ్మకపల్లికి చెందిన గుమ్మడిదల బిక్షపతి భార్య మల్లవ్వ రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యం బారిన పడగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేక పోయింది. భార్య మరణం ఆయన్ను కుంగదీసింది. పదేపదే ఆమెను తలచుకుంటూ బాధపడేవారు. కుమారుడు బాలయ్య బాగా చూసుకుంటున్నా ఆయన భార్యను తలచుకుంటూ మద్యం తాగుతూ గడిపేవాడు. తనకు బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ వస్తుండగా మద్యం మత్తులో చెబుతున్నారని భావించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన బిక్షపతి సాయంత్రం 5 గంటలు అయినా ఇంటికి రాలేదు. దాంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు కలిసి పొలం చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం చెరువు సమీపంలోని పొలం వద్దకు వెళ్లి చూడగా గట్టుపై చెప్పులు, మద్యం సీసా, కొంత డబ్బు కన్పించాయి. చెరువులో గాలించగా బిక్షపతి మృతదేహం వెలుగుచూడటంతో కొడుకు, కోడలు బోరున విలపించారు. ఆయన కుమారుడు బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుదిట్టం.. కట్టలు స్వాధీనం
[ 24-04-2024]
ఈ నెల 19న వికారాబాద్ జిల్లా నవాబుపేటలో పోలీసుల తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న రూ.1.05 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. -
సిద్దిపేట కోర్టులో హిజ్రాకు ఉద్యోగం
[ 24-04-2024]
సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ విభాగంలో హిజ్రాకు పొరుగు సేవల కింద ఉద్యోగం కల్పించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రశాంతిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.టి.రఘురాం, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి మంగళవారం నియామక పత్రం అందజేశారు. -
ధర లేక రైతన్న దిగాలు
[ 24-04-2024]
యాసంగిలో రైతులు ఎంతో ఆశతో సాగుచేసిన సన్నధాన్యానికి ధర లేకపోవటంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం సన్న బియ్యంకు ధర ఎక్కువగా ఉండటంవల్ల చాలా మంది కర్షకులు దానిని సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
[ 24-04-2024]
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. -
పెరుగుతున్న ప్రచార వేడి
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరఫున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. -
ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం
[ 24-04-2024]
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
త్రిలింగ ప్రాంతం.. భిన్న సంప్రదాయం
[ 24-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఆనుకొని ఉన్నాయి. -
సొంత గడ్డ... ఆధిక్యపు అడ్డా
[ 24-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వివిధ నియోజకవర్గాల నుంచి అయిదు సార్లు ఎంపీగా పోటీ చేయగా.. అత్యధిక ఆధిక్యం మాత్రం సొంతగడ్డ మెదక్లోనే సాధ్యమైంది. -
వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది
[ 24-04-2024]
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యకు దారి తీసింది. ఈ కేసులో సదరు మహిళ భర్తతోపాటు మరో ఇద్దరి నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
హత్యలతో కలవరం
[ 24-04-2024]
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు హత్యలు కలవరానికి గురిచేశాయి. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని అల్లుడు గొడ్డలితో హత్య చేశాడు. -
అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి
[ 24-04-2024]
వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్