ఔత్సాహిక క్రీడాకారులకు మంచి రోజులు
గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించిన సర్కారు గజ్వేల్ వేదికగా ఏర్పాటు చేయదలిచిన క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందుకు ప్రభుత్వం
గజ్వేల్లో క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు
20 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
న్యూస్టుడే, గజ్వేల్
కేటాయించిన భూమి..
గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి క్రీడలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించిన సర్కారు గజ్వేల్ వేదికగా ఏర్పాటు చేయదలిచిన క్రీడా గ్రామం ఏర్పాటుకు తొలి అడుగు పడింది. ఇందుకు ప్రభుత్వం గజ్వేల్లో 560/1 సర్వే నంబరులో 20 ఎకరాల స్థలం కేటాయించింది. రెండ్రోజుల కిందటే జిల్లా కలెక్టర్ ఈ మేరకు భూమిని క్రీడా శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఔత్సాహిక క్రీడాకారులకు ఇది ఎంతగానే ఉపయోగపడనుంది. ఇక్కడ క్రీడా గ్రామం అందుబాటులోకి వస్తే నియోజకవర్గ క్రీడాకారులతో పాటు జిల్లాలోని వారికి ఊతం ఇవ్వనుంది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 5 వేలమందికిపైగా వివిధ రంగాల క్రీడాకారులున్నారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ తదితర ఆటల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. వారితో పాటు మిగిలిన ఔత్సాహిక క్రీడాకారులు సాధన చేసేందుకు జిల్లా కేంద్రంలో తప్పితే ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ఎలాంటి సదుపాయాలు లేక చాలా మంది హైదరాబాద్, సిద్దిపేటలోని మైదానాలకు వెళ్లి సాధన చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలకు కూడా మైదానం లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు, దేవాలయాల స్థలాల్లో నిర్వహిస్తున్నారు. రెండేళ్ల కిందట గజ్వేల్ మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీశ్రావు గజ్వేల్లో క్రీడా గ్రామం నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలవటంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్లో మినీ స్టేడియం ఉన్నా పూర్తిస్థాయిలో క్రీడాకారులకు ఉపయోగపడక పోవడంతో తాత్కాలికంగా ఆర్టీఏ కార్యాలయానికి కేటాయించారు.
అందుబాటులోకి రానున్న సకల సౌకర్యాలు
క్రీడా గ్రామం నిర్మిస్తే సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, పుట్బాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ ట్రాక్, బాక్సింగ్ వేదికలు నిర్మించనున్నారు. వీటితోపాటు కళలు, ఇతర రంగాల్లో క్రీడాకారులకు సాధన చేయించే శిక్షకులను ప్రభుత్వం ఏర్పాటు నియమించనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు అతిథ్యం ఇచ్చేలా సౌకర్యాలు అందిరానున్నాయి. క్రీడల నిర్వహణతో గజ్వేల్ స్థాయి మరింత పెరగనుంది. నిరుడు ఆగస్టు నెలలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి గజ్వేల్ మినీ స్టేడియం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. త్వరలోనే అధునాతన సౌకర్యాలతో క్రీడా గ్రామం నిర్మిస్తామని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM