చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
టీవీ రిమోట్ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది.
టీవీ రిమోట్ విషయంలో దంపతుల మధ్య గొడవ
దౌల్తాబాద్, న్యూస్టుడే: టీవీ రిమోట్ విషయంలో భర్తతో గొడవ పడి ఓ మహిళ చెరువులో దూకి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదమ్మ(37) ఆదివారం మధ్యాహ్నం భర్త మల్లప్ప, ఇద్దరు కుమారులతో కలిసి ఇంట్లో టీవీ చూస్తుంది. ఆ సమయంలో టీవీ రిమోట్ గురించి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త ఆమెను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో తండ్రి, కుమారులు అంతా ఒక్కటే నేను ఒక్కదాన్ని వేరే అని చెప్ఫి. వంట చెరుకు కోసం పొలానికి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా... ఫలితం లేకుండా పోయింది.
గడ్డపోతారంలో మహారాష్ట్ర వాసి..
గడ్డపోతారం (జిన్నారం), న్యూస్టుడే: జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో పనిచేసే మహారాష్ట్రకు చెందిన కార్మికుడు రాహుత్(25) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఐడీఏ బొల్లారం పోలీసులు, గడ్డపోతారం గ్రామస్థుల కథనం ప్రకారం... పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్న రాహుత్ 10 రోజులుగా విధులకు హాజరు కాకపోగా.. శనివారం మాత్రం పనులకు వెళ్లి తిరిగి గడ్డపోతారంలోని అద్దె ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామంలో తిరిగాడు. అతడితోపాటు గదిలో ఉండే మరో స్నేహితుడు మొదటి షిఫ్టుకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఉరేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు.
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
అక్కన్నపేట (హుస్నాబాద్ గ్రామీణం), న్యూస్టుడే: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు పులి సురేశ్(35) దుర్మరణం చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్కూర్కు చెందిన సురేశ్ కొంతకాలంగా హుస్నాబాద్లో నివాసం ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేస్తున్నాడు. ఇందుకోసం రోజూ హుస్నాబాద్ నుంచి కట్కూర్కు వచ్చి వెళ్తాడు. ఆదివారం కట్కూర్ నుంచి హుస్నాబాద్కు వెళ్తున్నాడు. అంతకపేట వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే సురేశ్ మృతి చెందాడు. అతనికి భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈ విషయమై ఎస్ఐ కొత్తపల్లి రవిని వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు.
శివ్వంపేటలో..
జోగిపేట, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం పరిధిలోని శివ్వంపేట గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుర కార్మికుడు మృతిచెందినట్లు పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు.. చౌటకూరు మండలం సరాపల్లికి చెందిన ఎం.అర్జున్(35) సంగారెడ్డి పురపాలికలో పని చేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలోని శివ్వంపేట శివారులో డివైడర్ను ఢీకొనగా.. తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అర్జున్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు