ఇక వాహనాలు రయ్రయ్
ఓ ప్రాంతం అభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో రహదారులు ప్రగతికి నిలువుటద్దం లాంటివి. అందుకే ప్రభుత్వాలు వీటి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో
న్యూస్టుడే, పెద్దశంకరంపేట
పెద్దశంకరంపేట మీదుగా నిర్మించిన బైపాస్
ఓ ప్రాంతం అభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో రహదారులు ప్రగతికి నిలువుటద్దం లాంటివి. అందుకే ప్రభుత్వాలు వీటి నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లే 161 జాతీయ రహదారి పనులు మెదక్ జిల్లా పరిధిలో ఇటీవల పూర్తయ్యాయి. సంగారెడ్డి-నాందేడ్-అకోలా (ఎస్ఎన్ఏ) పేరిట నాలుగు వరుసలుగా విస్తరించిన ఈ మార్గం జిల్లాకు మరో మణిహారంలా మారింది. జిల్లాలో ఇప్పటికే 44, 765 (డి) జాతీయ రహదారులు ఉండగా ఇది మరింత హంగును తీసుకొచ్చింది. జిల్లా పరిధిలో 27 కి.మీ. మేర విస్తరించింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద మొదలై పెద్దశంకరంపేట మండలం జంబికుంట వరకు ఉంటుంది.
2012లో జాతీయ రహదారిగా గుర్తింపు..
సంగారెడ్డి-నాందేడ్-అకోలా మార్గాన్ని కేంద్రం 2012లో 161 జాతీయ రహదారిగా గుర్తించింది. భారత్ మాల ప్రాజెక్టులో చేర్చడంతో పాటు 2018-19లో బడ్జెట్లో నిధులు కేటాయించి విస్తరణకు శ్రీకారం చుట్టింది. తొలుత 140 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారి విస్తరణకు రూ.3,170 కోట్లు కేటాయించింది. కోల్కతాకు చెందిన సీఈ టెస్టింగ్ కన్సల్టెన్సీ సర్వే చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే పూర్తయిన ప్రాంతాల్లో భూములు సేకరించి 2013 భూసేకరణ చట్టాల ప్రకారం పరిహారం ఇచ్చారు. పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి కన్సల్టెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం కంది-రాంసాన్పల్లి మధ్యలో పనులు కొనసాగుతుండగా, మిగిలినవి పూర్తయ్యాయి.
విద్యుత్తు వెలుగులు ఇలా..
తొలగిన అడ్డంకులు..
రెండో ప్యాకేజీని కేఎన్ఆర్ నిర్మాణ సంస్థ చేపట్టి మూడేళ్లలో శరవేగంగా పూర్తి చేసింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ నుంచి పెద్దశంకరంపేట మండలం జంబికుంట వరకు మొత్తం 13 గ్రామాలు ఉండగా, పది చోట్ల దిగువ వంతెనలు నిర్మించి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేశారు. ముస్లాపూర్, బొడ్మట్పల్లి, కమలాపురం వద్ద మాత్రం వంతెనలు లేవు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మిగిలిన చోట్ల మాత్రం వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం నాలుగు వరుసల దారిలో 90 కి.మీ. మేర హాయిగా ప్రయాణం సాగించడానికి అవకాశం ఏర్పడింది.
266.05 ఎకరాల భూమి సేకరణ..
పెద్దశంకరంపేటలో 100.17, అల్లాదుర్గం మండలంలో 144.08, టేక్మాల్ మండలంలో 21.8 ఎకరాల చొప్పున మొత్తం 266.05 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. పాత రోడ్డు వెంట ఉన్న 1,080 చెట్లను తొలగించారు. రహదారి మధ్య నుంచి అడ్డంగా 200 మీటర్లు విస్తరించేలా సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించేలా ఇప్పటికే హద్దుగా ప్రహరీని సైతం నిర్మించారు. ఇక మొత్తం 8 కొత్త బైపాస్లను సంగారెడ్డి, అందోల్-జోగిపేట, పెద్దశంకరంపేట, నిజాంపేట, పిట్లం, పెద్దకొడప్గల్, మేనూరు, మద్నూర్ గ్రామాల వద్ద నిర్మించారు. జిల్లాలో పెద్దశంకరంపేట వద్ద బైపాస్ నిర్మించారు.
పెద్దశంకరంపేట నుంచి వెళ్లే రహదారి
రెండు ప్యాకేజీల పనులు పూర్తి
161 జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో రెండు ప్యాకేజీల పనులు పూర్తయ్యాయి. దీంతో ఆయా చోట్ల రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. పనులు పూర్తయిన ప్రాంతాల్లో త్వరలో టోల్ రుసుం వసూలుకు చర్యలు తీసుకుంటాం.
- మధుసూదన్రావు, పీడీ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!