గడువులోపుగగనమే!
జిల్లాలో సింగూరు, మంజీర ప్రాజెక్టులున్నా.. పట్టణాలకు తాగునీరు అందడం లేదు. జల వనరులు కళకళలాడుతున్నా.. ప్రజల దాహం తీర్చడం లేదు. గతంలో మిషన్ భగీరథ పథకం పనులు దక్కించుకున్న గుత్తేదారు సకాలంలో పూర్తి చేయలేదు. ఆ టెండరు రద్దు చేసి.. మరో గుత్తేదారుకు అప్పగించినా
మార్చి చివరి నాటికి తాగు నీరందించాలనేది లక్ష్యం
జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ‘మిషన్ భగీరథ’ పనుల తీరిదీ..
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
సంగారెడ్డిలో అసంపూర్తిగా..
జిల్లాలో సింగూరు, మంజీర ప్రాజెక్టులున్నా.. పట్టణాలకు తాగునీరు అందడం లేదు. జల వనరులు కళకళలాడుతున్నా.. ప్రజల దాహం తీర్చడం లేదు. గతంలో మిషన్ భగీరథ పథకం పనులు దక్కించుకున్న గుత్తేదారు సకాలంలో పూర్తి చేయలేదు. ఆ టెండరు రద్దు చేసి.. మరో గుత్తేదారుకు అప్పగించినా.. పనులు నత్తనడకనే సాగుతున్నాయి. మరోసారి గడువు పెంచి.. మార్చి 31 వరకు అన్ని పట్టణాలకు తాగు నీటిని సరఫరా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినా.. ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల ప్రజలు నీటి ప్లాంట్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కథనం.
ఎక్కడెక్కడ.. ఎలా..
పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట, మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి పరీవాహకంలోని మంజీర నది నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని కుళాయిల ద్వారా సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, అమీన్పూర్, ఐడీఏ బొల్లారం, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు-జోగిపేట, తెల్లాపూర్ పురపాలక సంఘాలున్నాయి. వీటి పరిధిలో నారాయణఖేడ్, అందోలు-జోగిపేట పురపాలికల్లో ఇప్పటికే ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. ఐడీఏ బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్లో గోదావరి జలాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మిగిలిన సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్లో భగీరథ అసంపూర్తి పనుల వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.
కాలపరిమితిలోపు పూర్తి చేస్తాం..
- వీరప్రతాప్, ప్రజారోగ్యశాఖ ఈఈ, సంగారెడ్డి
సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట పురపాలికల పరిధిలో భగీరథ పనులకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటిలోపు పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. గుత్తేదారును మార్చడం వల్ల గతంకంటే వేగంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని పురపాలికల పరిధిలో అదనంగా పనులు చేర్చడమూ జాప్యానికి కారణమే. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. అంతర్గత పైపులైన్ల పనులు పూర్తి చేసి నల్లా కనెక్షన్లపై దృష్టి సారిస్తాం.
జాప్యానికి కారణాలు ఇవే..
జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులను 2017లో ఆరంభించారు. అప్పట్లో నారాయణఖేడ్, జోగిపేటలో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో సకాలంలో పూర్తి చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్లో ప్రజారోగ్యశాఖకు పనుల బాధ్యతను అప్పగించారు. ఆ శాఖ ఆధ్వర్యంలో ఏడాదిలోపు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించినా.. ఆచరణలో అమలు కాలేదు. అప్పట్లో పనులు దక్కించుకున్న గుత్తేదారు మధ్యలోనే ఆపేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఆయా గుత్తేదారు సంస్థను రద్దు చేసి.. మరో సంస్థకు పనుల బాధ్యతను అప్పగించారు. గత ఏడాది నవంబరు నాటికి పనులు పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. పోతిరెడ్డిపల్లి, కొండాపూర్ మండలం మల్కాపూర్లో కొంత భాగాన్ని సంగారెడ్డి పురపాలికలో విలీనం చేయడంతో.. అంచనాలను పెంచాల్సి వచ్చింది. నిర్దేశిత గడువును ఈ ఏడాది మార్చి చివరికి పెంచారు. ఇక్కడ వచ్చే వేసవి నాటికి ట్యాంకులు, సంపుల నిర్మాణాలు పూర్తి చేసి.. నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నా.. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం గగనమేనని పలువురు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్ షా
[ 25-04-2024]
మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు -
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు