ఎట్టకేలకు నిధులు
జిల్లాలోనే పెద్ద పట్టణాల్లో ఒక్కటైన జహీరాబాద్లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పట్టణంలోని ఏ వీధిలో చూసినా గుంతలమయంగా మారిన అంతర్గత దారులే దర్శనమిస్తున్నాయి. మురుగు కాల్వలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు.
జహీరాబాద్లో రూ.2.62 కోట్లతో రోడ్లు, మురుగు కాల్వలు
ఆదర్శనగర్లో మట్టి రోడ్డు
న్యూస్టుడే, జహీరాబాద్: జిల్లాలోనే పెద్ద పట్టణాల్లో ఒక్కటైన జహీరాబాద్లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పట్టణంలోని ఏ వీధిలో చూసినా గుంతలమయంగా మారిన అంతర్గత దారులే దర్శనమిస్తున్నాయి. మురుగు కాల్వలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పట్టణ ప్రజలు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మురుగు రోడ్లపైనే పారుతోంది. ఎట్టకేలకు ప్రజల ఇక్కట్లు కొంతమేరకైనా తీరనున్నాయి. వివిధ వార్డుల్లో సిమెంటు దారులు, మురుగు కాల్వల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. వివిధ పథకాల ద్వారా ఇటీవల మంజూరైన రూ.2.62 కోట్లతో ఆయా పనులు చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో దశాబ్దాలుగా జహీరాబాద్ పట్టణ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతమేరకైనా దూరం కానున్నాయి.
ప్రతిపాదిత పనులు ఇవే..
* 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో ఆదర్శనగర్ కాలనీలో సిమెంటు రోడ్లు, రూ.27 లక్షలతో రాచన్నపేటలోని శ్మశాన వాటిక వద్ద రహదారి, రూ.28.50 లక్షలతో చెన్నారెడ్డినగర్, ఆదర్శనగర్లో సిమెంటు దారులు, రూ.35.50 లక్షలతో మాణిక్ప్రభు వీధిలో మురుగు కాల్వ, కల్వర్టు, బసవేశ్వర వీధి, మహతాబ్బాగ్, చెన్నారెడ్డినగర్ పార్కుకు సిమెంటు రోడ్లు, రూ.27 లక్షలతో కరీం కాలనీ, 14వ వార్డులో మురుగు కాల్వ, సిమెంటు దారుల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.14 లక్షలతో ఎస్బీహెచ్ కాలనీలో మురుగు కాల్వ, శ్రీనగర్కాలనీలో కల్వర్టు, రూ.8 లక్షలతో బసవేశ్వరవీధిలోని శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.
* పట్టణ ప్రగతి నిధులు రూ.10 లక్షలతో 11వ వార్డులోని సంతోషిమాత ఆలయం సమీపంలో మురుగు కాల్వ, రూ.10 లక్షలతో 3వ వార్డులో సిమెంటు రోడ్లు, రూ.10 లక్షలతో 9వ వార్డులో సిమెంటు రోడ్లు, రూ.7.50 లక్షలతో రామ్నగర్లో సిమెంటు రోడ్డు, రూ.10 లక్షలతో 12వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు.
* 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.25 లక్షలతో బస్టాండు సమీపంలో సిమెంటు రోడ్డు, చిన్న హైదరాబాద్లో సిమెంటు రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM