నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవం
జిల్లా కేంద్రం మెదక్లో గణతంత్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక సమీకృత కలెక్టరేట్లో ఉదయం పది గంటలకు పాలనాధికారి హరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా.బీఆర్
కలెక్టరేట్లో జాతీయ పతాకానికి గౌరవ వందనం చేస్తున్న పాలనాధికారి హరీష్, అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్, రమేశ్
మెదక్, న్యూస్టుడే: జిల్లా కేంద్రం మెదక్లో గణతంత్ర దిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. స్థానిక సమీకృత కలెక్టరేట్లో ఉదయం పది గంటలకు పాలనాధికారి హరీష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి అర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలను నిర్వహించారు. పది నిమిషాల్లోనే కార్యక్రమం పూర్తి కావడం గమనార్హం. అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్, రమేశ్, శిక్షణ కలెక్టర్ అశ్వని, జిల్లా అధికారులు శ్రీనివాస్, రమేశ్కుమార్, జయరాజ్, కృష్ణమూర్తి, పరశురాం నాయక్, తరుణ్కుమార్, శ్రీనివాస్, రాజిరెడ్డి, విజయశేఖర్రెడ్డి, గంగయ్య, వెంకటేశ్వర్రావు, శాంతికుమార్, రాజిరెడ్డి, డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.
సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణిప్రియదర్శిని
ప్రజలతో మమేకం కావాలి: ఎస్పీ
పోలీసు ఉద్యోగం రావడం అదృష్టం.. ప్రజలతో మమేకమై, వారి ఆదరాభిమానాలను పొందాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయుల త్యాగం వల్ల స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అకింతభావంతో పనిచేసి ప్రజల్లో మంచి పేరు సాధించినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. డీఎస్పీ సైదులు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ నాగేశ్వర్రావు, సూరపునాయుడు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో గణతంత్ర వేడుకలు
జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం కొవిడ్ నిబంధనల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పాలనాధికారి హనుమంతరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. పాలనాధికారి ప్రసంగం లేకుండానే కార్యక్రమాన్ని పూర్తిచేయడం గమనార్హం. ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి రాధికారమణి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఎం.రమణకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, ఏఆర్డీఎస్పీ జనార్దన్, ఎస్బీ సీఐ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, అర్బన్
మహనీయుల బాటలో నడుద్దాం
అదనపు పాలనాధికారి ముజమ్మిల్ఖాన్
కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవం
కలెక్టరేట్లో జెండా వందనం చేస్తున్న అదనపు పాలనాధికారులు ముజమ్మిల్ఖాన్, శ్రీనివాస్రెడ్డి,
జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, సీపీ శ్వేత, ఐఏఎస్ శిక్షణార్థి ప్రఫుల్దేశాయ్
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: స్వాతంత్య్రం పోరాటంలో అమరులైన మహనీయులను స్మరించాలని, వారి బాటలో నడవాలని జిల్లా అదనపు పాలనాధికారి ముజమ్మిల్ఖాన్ ఆకాంక్షించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. మనందరికి పండుగ రోజు అని, ప్రపంచంలో అతిగొప్ప సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా నిలిపేందుకు డా. బీఆర్ అంబేడ్కర్ సారథ్యంలో 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల అడుగుడుజాడల్లో ముందుకు సాగాలన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!