సర్వే బాట.. సేవల మాట.!
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలే ధ్యేయంగా వారితో మమేకమవుతున్నారు. ఇప్పటికే ప్రతి గురువారం బస్ డే నిర్వహిస్తున్న డిపో అధికారులు.. ఏదో ఒక మార్గంలో బస్సుల్లో
ప్రయాణికులతో ఆర్టీసీ అధికారుల మమేకం
న్యూస్టుడే, సిద్దిపేట టౌన్
ఆర్టీసీ బలోపేతమే లక్ష్యంగా అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలే ధ్యేయంగా వారితో మమేకమవుతున్నారు. ఇప్పటికే ప్రతి గురువారం బస్ డే నిర్వహిస్తున్న డిపో అధికారులు.. ఏదో ఒక మార్గంలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో సమస్యలపై ఆరా తీస్తున్నారు. తాజాగా పింఛను లబ్ధిదారుల ప్రయాణ అవసరాలపై సర్వే చేపట్టారు. మొత్తం 14 ప్రశ్నలతో కూడిన ఫారాన్ని నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఇటీవల (ఈ నెల 25వ తేదీ నుంచి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డిపోల పరిధిలో మండలాల వారీగా అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరించడంలో నిమగ్నమవుతున్నారు.
జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 284 బస్సుల ద్వారా సేవలు అందుతున్నాయి. కొవిడ్ పరిస్థితులు మినహాయిస్తే సాధారణ రోజుల్లో నిత్యం సుమారు రూ.32 లక్షల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 118 మార్గాల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులను ప్రగతిరథ చక్రాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతుంటారు. రోజువారీగా 1.02 లక్షల కి.మీ. మేర సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. విద్యాసంస్థలు తెరిచి ఉన్న క్రమంలో ప్రాంగణాలు, పట్టణాలు కళకళలాడుతుంటాయి. తరువాత పండుగల వేళ రద్దీ విపరీతంగా ఉంటుంది. రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒడుదొడుకుల నడుమ నష్టాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ తరుణంలో సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల అవసరాలు, ఇబ్బందులను తెలుసుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడు కేటగిరీల్లో పింఛనుదారులు..
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత సహా ఏడు కేటగిరీల్లో పింఛనుదారులను సర్వే ద్వారా పలకరిస్తున్నారు. వారితో పాటు అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాలో సంబంధిత జాబితాలను ఆయా శాఖల అధికారుల నుంచి తీసుకున్నారు. గ్రామాల వారీగా నమూనాగా కొంత మందితో సర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమం దాదాపు వారం పాటు కొనసాగించనున్నారు. ప్రయాణ అవసరాలే లక్ష్యంగా వివరాల సేకరణ సాగుతోంది. లబ్ధిదారుని పూర్తి వివరాలు పూరించడంతో పాటు ప్రయాణ అవసరాలు, తరచూ ఎక్కడి నుంచి ఎటు వైపు వెళ్తున్నారు, అందుబాటులో ఉన్న ఇతర వాహనాలు, ఆర్టీసీ బస్సు సదుపాయం ఉందా.. లేదా.. రాయితీ కార్డు ఇస్తే సద్వినియోగం చేసుకుంటారా..? అంటూ ఆరా తీస్తున్నారు. తద్వారా రానున్న రోజుల్లో బస్సు సదుపాయం మెరుగుపర్చడంతో వారికి అనుకూలంగా ప్రత్యేక సదుపాయాలు, రాయితీ కల్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే బస్సుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులపై ప్రచార ప్రకటనలు తొలగించారు. రానున్న రోజుల్లో ఆన్లైన్లో రవాణా చెల్లింపులపై మరింత శ్రద్ధ కనబర్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
పండగ తరువాత ప్రభావం..
కరోనా మూడో దశ.. ఆర్టీసీపై విరుచుకుపడుతోంది. సంక్రాంతి పండుగ తరువాత ప్రభావం పెరుగుతోంది. గత ఏడాది రెండో దశ అనంతరం సెప్టెంబరు నుంచి ఆదాయం పెరిగింది. నిత్యం దాదాపు రూ.32 లక్షల ఆదాయం వస్తుండగా.. ప్రస్తుతం ఆ మొత్తం రూ.25 లక్షలకు చేరడం గమనార్హం. ఈ లెక్కన రోజులో రూ.7 లక్షల వరకు ఆదాయం కోల్పోయినట్లయింది. విద్యార్థులకు సెలవులు పొడిగించడం, కరోనా తీవ్రత కారణంగా ఎక్కువ శాతం బస్సులో ప్రయాణించకపోవడం, ఇతరత్రా కారణాలతో ఆర్టీసీ మరోసారి ఆదరణ కోల్పోతుంది. సర్వే విషయమై ‘న్యూస్టుడే’ సిద్దిపేట డిపో మేనేజర్ రామ్మోహన్రెడ్డిని సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపట్టామన్నారు. ఈమేరకు నివేదికను పంపిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ
[ 29-03-2024]
వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. -
ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
[ 29-03-2024]
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. -
డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
[ 29-03-2024]
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. -
ప్రకృతివనం భూమి ధారాదత్తం
[ 29-03-2024]
చేగుంట మండలం అనంతసాగర్ శివారులో నాలుగేళ్ల క్రితం సుమారు పది ఎకరాల్లో రూ.40 లక్షలు వెచ్చించి బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేశారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి చేశారు. -
ఖాళీ బిందెలతో కనిపించొద్దు: కలెక్టర్
[ 29-03-2024]
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఖాళీ బిందెలతో నీళ్ల కోసం కనబడితే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మిషన్ భగీరథ నీళ్లు తప్పనిసరిగా ప్రతి గడపకు అందాలన్నారు. -
బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్
[ 29-03-2024]
మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుభాష్చంద్రబోస్ ఎన్నికయ్యారు. గురువారం మెదక్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఎన్నిక నిర్వహించారు. -
జీవ వైవిధ్యం.. సంరక్షణతో పదిలం
[ 29-03-2024]
జీవవైవిధ్య సంరక్షణలో మొక్కల పాత్ర కీలకం.. ఇదే క్రమంలో అంతరించిపోతున్న వాటిని సంరక్షించాలి.. మానవాళికి ఉపయోగపడే వాటిని దరిచేర్చాల్సిన ఆవశ్యకతను సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిన ప్రభుత్వ డిగ్రీ... -
బస్సులెక్కే మహిళలే లక్ష్యంగా చోరీలు
[ 29-03-2024]
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి బ్యాగులో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం
[ 29-03-2024]
ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. -
సంపాదనలో పేదలకు 2.5 శాతం
[ 29-03-2024]
పవిత్ర రంజాన్ మాసం రెండో దశ కొనసాగుతోంది. ఈ మాసంలో సంపాదనలో 2.5 శాతం పేదలకు దానధర్మాలు చేస్తుంటారు. ముస్లింలు నెల రోజుల పాటు తరావీ నమాజుకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో, -
జీపు, ఆటో ఢీకొని ప్రయాణికుడి దుర్మరణం
[ 29-03-2024]
జీపు, ఆటో ఢీ కొని ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన యాలాల మండల పరిధిలోని అగ్గనూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ తెలిపిన ప్రకారం.. -
అప్పుల బాధతో కార్పెంటర్ ఆత్మహత్య
[ 29-03-2024]
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామీణ ఠాణా ఏఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలు.. -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
[ 29-03-2024]
ప్రసిద్ధ వర్గల్ విద్యాధరి క్షేత్రంలో శ్రీపరివార సమేత చంద్రమౌళీశ్వర స్వామి ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య... -
సీనియర్ సివిల్ జడ్జికి పీహెచ్డీ ప్రదానం
[ 29-03-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి, సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి ఎం.రాధాకృష్ణ చవాన్కు గురువారం పీహెచ్డీ ప్రదానం చేశారు. -
ఆలయ డబ్బుల దుర్వినియోగంలో ఆడిటర్ ధనుంజయ్ రిమాండ్
[ 29-03-2024]
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదాయపన్ను, జీఎస్టీ రిటర్న్స్ దాఖలు డబ్బుల దుర్వినియోగం కేసులో ప్రైవేట్ ఆడిటర్ ధనుంజయ్ని రిమాండ్కు తరలించామని చేర్యాల సీఐ ఎల్.శ్రీనివాస్ గురువారం రాత్రి తెలిపారు.