logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఐడీఏ బొల్లారం శివారులోని బాహ్యవలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Updated : 27 Jan 2022 19:04 IST

జిన్నారం: ఐడీఏ బొల్లారం శివారులోని బాహ్యవలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక సీఐ జి.ప్రశాంత్‌ కథనం ప్రకారం.. ఐడీఏ బొల్లారం శివారులోని మోడల్‌ స్కూల్‌ సమీపంలో రింగురోడ్డుపై మొక్కలకు నీళ్లు పడుతుండగా వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్‌ క్లీనర్‌ నవీన్‌(19), ఒప్పంద కార్మికుడు సత్తయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న మహేశ్వర్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలను పంచనామా నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని