పట్టణ ప్రగతిలో అగ్రభాగాన నిలుద్దాం
వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభయ్యే పట్టణ ప్రగతిని సమష్టిగా విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలు
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి హరీశ్రావు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్రావు, చిత్రంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు
పద్మా దేవేందర్రెడ్డి, మాణిక్రావు, క్రాంతికిరణ్, మదన్రెడ్డి, ఎమ్మెల్సీ
ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సిద్దిపేట, న్యూస్టుడే: వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభయ్యే పట్టణ ప్రగతిని సమష్టిగా విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీలు అగ్రభాగాన నిలవాలని సూచించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపాలిటీల ఛైర్మన్లు, కమిషనర్లతో హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో రాష్ట్రంలోని గ్రామాలు కొత్త రూపును సంతరించుకున్నాయని, మున్సిపాల్టీలు మాత్రం బాగుపడలేదన్నారు. ఈ దఫా స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. వైకుంఠధామాలు, కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టాలని, నిర్లక్ష్యం వహించే ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చాలని, మురుగు కాల్వలు శుభ్రం చేయాలన్నారు. చెత్త సేకరణలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఐదుసార్లు జాతీయస్థాయి పురస్కారాన్ని దక్కించుకుందని, ఉమ్మడి జిల్లా నుంచి సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత పర్యటనకు ప్రభుత్వం పంపించే ఏర్పాట్లు చేయనుందన్నారు మున్సిపాలిటీల్లోనూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు యువతతో కమిటీలు నిర్మించాలని, అవసరమైన క్రీడా సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లెలు, పట్టణాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు సంకల్పించారన్నారు. పట్టణాల్లో ప్రతి రోజు ఒకే సమయానికి నల్లాల ద్వారా నీరు సరఫరా చేయాలని, పాఠశాలలు, ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, త్వరలోనే నియామకాలు జరగనున్నాయన్నారు. రాష్ట్రంలో ఎర్లీ బర్డ్ పథకం కింద అత్యధిక పన్ను వసూళ్లతో జహీరాబాద్ తొలిస్థానంలో నిలవడంపై అభినందించారు.
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు.. సభ్యత్వాలు..
మండలాలు, నియోజకవర్గాల వారీగా నీటి వనరుల లెక్క తేల్చాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా మత్స్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉందని, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ వారి సమస్యలు, డిమాండ్లపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సిద్దిపేట జిల్లాలో 381 నీటి వనరులకు, మెదక్లో 235, సంగారెడ్డిలో 196 వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతికిరణ్, పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, యాదవరెడ్డి, ఫారూఖ్హుస్సేన్, ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కలెక్టర్లు హనుమంతరావు, హరీశ్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం బూక్య, మున్సిపల్ కమిషనర్లు, ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాలతో నాంది
[ 18-04-2024]
జిల్లా స్థాయిలో లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి కలెక్టరేట్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
కమనీయం.. రాములోరి కల్యాణం
[ 18-04-2024]
రఘుకుల నందన.. వారధి బంధన.. శ్రీరామ జయరామ’ అంటూ భక్తుల జయజయద్వానాలతో జిల్లా వ్యాప్తంగా రామాలయాలు మార్మోగాయి -
పడిలేచిన కెరటం.. అర్పిత
[ 18-04-2024]
అనాథ పిల్లల జీవితాలే ఆ యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెరిసేలా చేశాయి. మూడు సార్లు పరీక్షలో విఫలమైనా నిరాశ చెందకుండా ముందడుగు వేసి విజయం సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది -
ఉక్కపోత.. బిల్లుల మోత
[ 18-04-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. -
పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం
[ 18-04-2024]
సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా -
ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
[ 18-04-2024]
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం -
నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
[ 18-04-2024]
-
గెలుపు వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు అవకాశాలపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్
[ 18-04-2024]
భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్ 78వ బూత్ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ