logo

ఆధ్యాత్మిక చింతన అవసరం: చినజీయర్‌ స్వామి

ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. సదాశివపేట మండలం వెంకటాపూర్‌ వేంకటాచల దివ్య క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా

Published : 20 May 2022 01:15 IST

ప్రవచనం చేస్తున్న స్వామిజీ

సదాశివపేట, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరమని చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. సదాశివపేట మండలం వెంకటాపూర్‌ వేంకటాచల దివ్య క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం విష్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, శాంతిహోమం నిర్వహించారు. విష్ణు సహస్ర నామపారాయణం చేశారు. సాయంత్రం పుష్పాధివాసం, ఫలాధివాసం కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా చినజీయర్‌ స్వామిజీ భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. భగవన్నామ స్మరణతో సకలశుభాలు సాధ్యమన్నారు. హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు. వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని