రక్తనిధి.. ఖాళీ!
నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడి కేంద్రంలో రక్తం నిల్వ ఉంచకుండా అవసరమైనప్పుడు మెదక్ నుంచి తెప్పిస్తుండటం గమనార్హం. 2019, ఏప్రిల్లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి.. అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆరంభం నుంచి నేటి వరకూ 176
న్యూస్టుడే, నర్సాపూర్
కేంద్రంలో పరికరాలు ఇలా...
నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇక్కడి కేంద్రంలో రక్తం నిల్వ ఉంచకుండా అవసరమైనప్పుడు మెదక్ నుంచి తెప్పిస్తుండటం గమనార్హం. 2019, ఏప్రిల్లో రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించి.. అవసరమైన పరికరాలు సమకూర్చారు. ఆరంభం నుంచి నేటి వరకూ 176 మందికి రక్తం అందించారు. ప్రస్తుతం మెదక్ నుంచి ఇక్కడికి తరలించి అవసరమైన రోగులకు ఎక్కిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో అవస్థలు..
నిత్యం నర్సాపూర్ దవాఖానాకు 350 నుంచి 450 మంది రోగులు వస్తుంటారు. ఇన్పేషంట్లుగా వంద మంది వరకు చేరుతున్నారు. సంత రోజు శుక్రవారం రోగుల సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. వీరే కాకుండా నిత్యం ప్రసవాలు, శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 16 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, వెల్దుర్తి, కౌడిపల్లి, చిలప్చెడ్ మండలాలతో పాటు పక్కనే ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల, జిన్నారం మండలాల నుంచి రోగులు తరలివస్తున్నారు. ఇక్కడ రక్తం అందుబాటులో ఉంచకపోడంతో అత్యవసర సమయాల్లో మెదక్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రోగులు బంధవులు వాపోతున్నారు. అవసరం ఉన్న వారు నేరుగా మెదక్కు వెళ్లడం, లేదంటే సిబ్బంది వెళ్లి తీసుకురావడం జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడి కేంద్రంలో 50 ప్యాకెట్ల వరకూ నిల్వ చేసే అవకాశం ఉంది.
వేసవి కావడంతో..
- డాక్టర్ మీర్జాబేగ్, ఆస్పత్రి పర్యవేక్షకులు
ప్రస్తుతం వేసవి నేపథ్యంలో రక్తం నిల్వ ఉంచడం లేదు. అవసరం ఉన్న వారికి ఒక రోజు ముందుగా మెదక్ నుంచి తెప్పిస్తున్నాం. నిల్వ చేసిన రక్తం 30 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత పనికి రాకుండా పోతుంది. ఎవరైనా రక్తదానం చేసినా ఇక్కడ నిల్వ చేసే అవకాశం ఉండదు. నేరుగా మెదక్లోని కేంద్రానికి తరలించాల్సి ఉంటుంది. అక్కడ పరీక్షలు నిర్వహించాక.. అవసరమైతేనే ఇక్కడికి పంపుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM