సరికొత్త ఆలోచన.. ఆదాయానికి ఆలంబన
ఆయిల్పామ్.. దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలను అందించే ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. పలు రకాల రాయితీలను సైతం కల్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం
ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటల సాగు
న్యూస్టుడే, ములుగు
ఎర్రవల్లిలో సాగు చేసిన వేరుసెనగ
ఆయిల్పామ్.. దీర్ఘకాలికంగా ఆర్థిక లాభాలను అందించే ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. పలు రకాల రాయితీలను సైతం కల్పించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంట నాటినప్పటి నుంచి మూడున్నరేళ్ల తర్వాత ఫలసాయం రైతుకు అందుతుంది. అప్పటివరకు ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేసేలా సూచనలు చేయడంతో పలువురు ఈ దిశగా అడుగేసి లాభాలు ఆర్జిస్తుండటం గమనార్హం.
3500 ఎకరాల్లో..
సిద్దిపేట జిల్లాలో అధికారుల రికార్డుల ప్రకారంగా 3500 ఎకరాలలో రైతులు ఆయిల్పామ్ తోటలు వేశారు. 90 శాతం రాయితీపై ప్రభుత్వం మొక్కలు, డ్రిప్ పరికరాలు, ఎరువులు అందించింది. ఆయిల్పామ్ మొక్కలు నాటిన రైతులందరూ దిగుబడులు వచ్చే వరకు ఎదురుచూడకుండా ఆ తోటల్లో అంతర పంటలు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సూచనల మేరకు అంతర పంటలు పండించారు.
అన్ని రకాలుగా..
ఒక్కో ఆయిల్పామ్ మొక్క 9 మీటర్ల మేర దూరం నాటడం వల్ల సూర్యరశ్మి బాగా అందడంతో పాటు పోషకాలు సైతం సమృద్ధిగా అందే వీలుంటుంది. ఇది అంతర పంటల సాగుకు కలిసొచ్చే అంశం. రెండు పంటలకు వేర్వేరుగా నీరు, ఎరువులు అందించే అవకాశం ఉంటుంది. దీని వల్ల వేరే పంటలు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వేరుసెనగ, శనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసర, మొక్కజొన్న వంటి వాటిని అంతరంగా సాగు చేస్తున్నారు. ఇవన్నీ మంచి లాభాలు అందించేవి కావడంతో రైతులకు అదనపు ఆదాయం పక్కాగా మారింది.
అదనంగా ఆదాయం: రాజిరెడ్డి, ఎర్రవల్లి
3 ఎకరాలలో ఆయిల్పామ్ తోట వేశా. ఈ పంట ఉత్పత్తులు చేతికి రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదురుచూడకుండా వేరుసెనగ, మినుములు అంతరంగా సాగు చేస్తున్నా. మినుములు చేతికిరాగా మంచి లాభాలు వచ్చాయి. రైతులందరూ ఇలా అడుగేస్తే ఎన్నో లాభాలున్నాయి.
అధికారుల సూచనలతో..: సుధాకర్రెడ్డి, ఎర్రవల్లి
నేను 5 ఎకరాల్లో ఆయిల్పామ్ పండిస్తున్నా. అధికారుల సూచనలతో వేరుసెనగ, పొద్దుతిరుగుడు, పెసర వేశాను. ఆయా పంటలు చేతికి వచ్చాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో రూ.90 వేల వరకు మిగిలింది. ఇలా కొత్తగా ఆలోచిస్తే లాభాలు పొందడం ఎంతో సులభం.
రైతుల్లో మార్పు రావాలి: నాగేందర్రెడ్డి, ఏవో, మర్కూక్
పంటల సాగులో రైతులు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుండాలి. దీర్ఘకాలిక పంటలు వేసినప్పుడు వాటి వల్ల ఫలసాయం అందడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ఖాళీగా ఉండే భూమిలో అంతర పంటలు వేస్తే లాభదాయకం. ఆయిల్పామ్ తోటల్లో ఇలా అదనంగా ఆదాయం పొందవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులకు నిర్వహణ నిధులు
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు సంబంధించి రెండో విడత నిధులు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులు గత ఏడాది జులైలో ప్రభుత్వం విడుదల చేసింది. -
కొత్త రేషన్కార్డులకు.. కోడ్ అడ్డంకి
[ 28-03-2024]
ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొందరికే ఇవి ఉండగా, చాలా మందికి లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కేవలం పథకాలే కాకుండా వైద్య సేవలు పొందే అవకాశం లేక ఆర్థికభారం పడుతోంది. -
సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..
[ 28-03-2024]
సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్ పొందడం గమనార్హం. -
గడువు ముంగిట పనుల హడావుడి
[ 28-03-2024]
పల్లెల్లో మట్టి దారులను సీసీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేస్తోంది. ఇందుకోసం గత నెల తొలి వారంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నెలాఖరుకు గడువు విధించారు. -
కార్మికులకు గుర్తింపు.. పథకాలతో ప్రయోజనాలు
[ 28-03-2024]
కార్మికులకు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి జారీ చేసే గుర్తింపు కార్డులు చాలా ముఖ్యం. దీంతో సంఘంలో గుర్తింపు పాటు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. -
విద్యార్థులకు ప్రేరణ
[ 28-03-2024]
ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లోని సృజనను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ప్రేరణ పేరుతో వారికి ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
ఈత కొలను తెరవరా?
[ 28-03-2024]
సిద్దిపేటలోని ఈత కొలను నిర్వహణ కొరవడుతోంది. నిత్యం కొనసాగించాల్సిన ఈ కొలను.. వేసవి ఆరంభమైన ఇంకా తెరవడం లేదు. ఆరేళ్ల కిందట అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ రూ.5 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు వెచ్చించి అందుబాటులోకి తెచ్చారు. -
అరచేతిలో లక్షల పుస్తకాలు
[ 28-03-2024]
ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. గ్రంథాలయాలు, కోచింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
స్పందించండి.. సంధించండి
[ 28-03-2024]
ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. -
మహిళాభ్యున్నతికి సహకారం
[ 28-03-2024]
సహకార బ్యాంకులు మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైౖతులకు రుణాలు ఇవ్వడం..వసూలు చేయడానికి ఇవి గతంలో పరిమితమయ్యేవి. ఇప్పుడు మహిళలు అర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించడంలోనూ ముందుంటున్నాయి. -
దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం
[ 28-03-2024]
వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. -
ఆస్తి కోసం చిన్నమ్మనే కడతేర్చాడు
[ 28-03-2024]
ఈనెల 21న టేక్మాల్ మండలం తంపులూరులో హత్యకు గురైన మహిళను ఆమెకు వరుసకు కొడుకయ్యే వ్యక్తే చంపినట్లు పోలీసులు గుర్తించారు. టేక్మాల్లో అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి బుధవారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. -
నిండు మనసుతో ఆశీర్వదించండి
[ 28-03-2024]
ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్ పార్లమెంట్ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. -
మాజీ కలెక్టర్కు వేల కోట్లు ఎక్కడివి?
[ 28-03-2024]
భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు.డిమాండ్ చేశారు. -
భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్రెడ్డి
[ 28-03-2024]
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!