logo

కేసీఆర్‌ను గద్దె దించేదాకా పోరాడుతా..

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. ఆయన్ను గద్దె దించేదాకా పోరాడుతా.. అప్పటివరకు రాజకీయాల్లో కొనసాగుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా

Published : 21 May 2022 01:26 IST

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. ఆయన్ను గద్దె దించేదాకా పోరాడుతా.. అప్పటివరకు రాజకీయాల్లో కొనసాగుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు చేశారు. శాసనసభ్యులు పార్టీ మారకుండా చూసుకోవల్సిన బాధ్యత అధిష్ఠానానిదే అన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉండేది లేనిది అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని.. పదవుల కోసం పార్టీ మారే ఆలోచన లేదన్నారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో భాజపాలో చేరుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ఊహాగానాలు వస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని