కోల్పోయినా.. కనికరించలే!
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ (జీపీ) బల్దియా పరిధిలో రహదారుల విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల నేతలు వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల బాధితులకు రెండు పడక గదులు ఇళ్లు
అందని పరిహారం..
ఇళ్ల కేటాయింపులో ఇష్టారాజ్యం
న్యూస్టుడే, గజ్వేల్
గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజ్ఞాపూర్లో కూల్చివేసిన ఇళ్లు
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ (జీపీ) బల్దియా పరిధిలో రహదారుల విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితుల పట్ల నేతలు వివక్ష చూపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల బాధితులకు రెండు పడక గదులు ఇళ్లు కేటాయిస్తుండగా మరి కొన్నిచోట్ల మొండిచేయి చూపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారంతోపాటు పట్టణాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఐదేళ్లుగా జీపీ బల్దియా పరిధిలో రోడ్ల విస్తరణ చేపడుతోంది. ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్-గజ్వేల్ ప్రధాన రహదారి, పిడిచేడు, సంగాపూర్ మార్గాలను నాలుగు వరుసలుగా విస్తరించారు. ఈనేపథ్యంలో దాదాపు 160 ఇళ్ల వరకు దెబ్బతిన్నాయి. పాతిక మందికిపైగా పూర్తిగా ఇళ్లను కోల్పోయారు. ఆ సమయంలో వారికి అధికారులు, నేతలు పలు హామీలు ఇచ్చారు. 50 శాతంలోపు ఇల్లు కోల్పోతే మరమ్మతులకు డబ్బులు ఇస్తామని.. 75 శాతానికి పైగా కూల్చివేస్తే.. ప్రత్యామ్నాయంగా మరోచోట రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. ఇంత వరకు ఎవ్వరికీ పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. గజ్వేల్ ఇందిరాపార్కు నుంచి కోటమైసమ్మ దేవాలయం రోడ్డు విస్తరణకు ఇళ్ల కూల్చివేత సాగుతోంది. ఇందులో 155 ఇళ్లను గుర్తించగా ఇప్పటిదాకా 126 కూల్చివేశారు. 37 మందికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేశారు. గజ్వేల్ నుంచి దాచారం వరకు విస్తరిస్తున్న రహదారిలో దాదాపు పాతిక ఇళ్ల వరకు కూల్చివేస్తున్నారు. ఇక్కడా పలురికి ఇళ్లు మంజూరు చేశారు. బాధితులు అందరికీ ఒకే తీరున కాకుండా కొందరికే ఇళ్లు ఇవ్వటం వెనక స్థానిక నేతలు చక్రం తిప్పారన్న ప్రచారం సాగుతోంది.
ప్రజ్ఞాపూర్కు చెందిన వడ్డెపల్లి వెంకటేశం.. రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటిని పూర్తిగా కోల్పోయారు. కుటుంబంతో అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రెండు పడక గదుల ఇల్లు కేటాయింపునకు అధికారులు సర్వే చేపట్టారు. ఈక్రమంలో తనకు ఇల్లు ఇస్తారా లేదా అనే బెంగ పెట్టుకున్నారు. అధికారుల వద్దనే గతేడాది సెప్టెంబరులో గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. దీంతో వెంకటేశం కుటుంబం రోడ్డుపాలైంది. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి ఇల్లు కేటాయించలేదు.
‘పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇంటిని రోడ్డు విస్తరణ కోసమని కూల్చేశారు.. రాజకీయ నాయకులొచ్చి పరిహారం కింద రెండు పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని చెప్పిపోయిండ్రు.. ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఎవ్వరు రాలే.. పైసా పరిహారం ఇవ్వలే ఇళ్లను కేటాయించలే.. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులతో రేకుల ఇంటిలో ఉంటున్నం.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ కనికరించటం లేదు’.
- ఇది ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన ఎరుకుల భారతమ్మ ఆవేదన.
పంపిణీ ఎప్పుడో..
రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రెండు పడక గదుల గృహాల పంపిణీలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన నేతలు... నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పంపిణీ చేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు బాధితులు అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కొందరు అప్పులు చేసి సగం కూలిపోయిన ఇంటిని బాగు చేసుకున్నారు. ఎలాంటి ఆర్థిక సాయం చేయకపోవటంతో అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితులకు న్యాయం చేస్తాం..
- ముత్యంరెడ్డి, గడా ఓఎస్డీ
రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తాం. వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తాం. ప్రస్తుతం రోడ్ల విస్తరణ జరుగుతున్న చోట బాధితులకు ప్రభుత్వ సూచనల మేరకు రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహీర్లో యువకుడి దారుణ హత్య
[ 23-04-2024]
కోహీర్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అర్ధరాత్రి దాటాక దాడి చేసి హత్య చేశారు. -
మెదక్ నుంచి ఇందిర.. ఎందుకు పోటీ చేశారంటే?
[ 23-04-2024]
అది 1977 సంవత్సరం.. అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేశారు. ఆ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఉత్తరప్రదేశ్లోనూ ఇందిర ఓడిపోయారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
[ 23-04-2024]
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
కాంగ్రెస్ది అవినీతి, కుటుంబ పాలన
[ 23-04-2024]
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలో జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. -
ఏడు నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి సోమవారం ఏడుగురు నామినేషన్లు వేశారు. తెలంగాణ రాజ్య సమితి నుంచి తుపాకుల మురళీకాంత్, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి మైసన్గారి సునీల్ నామపత్రాలను దాఖలు చేశారు. -
భాజపా దుష్ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 23-04-2024]
భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో భాజపా సాగిస్తున్న దుష్ప్రచారం అబద్ధమని, గోబెల్ ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
చితికిపోతున్న.. చిరు వ్యాపారులు
[ 23-04-2024]
జిల్లాలోని పురపాలికల్లో వీధి వ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణం ప్రతిపాదనల దశ దాటడం లేదు. మెదక్లో నిర్మాణం చేపట్టినా ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. -
విజ్ఞాన నేస్తం.. మార్గదర్శనం
[ 23-04-2024]
పుస్తకం.. సమస్త విజ్ఞానాన్ని సమకూర్చుతుంది. మనిషిని మనీషిగా మార్చేందుకు బాటలు వేస్తుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అంటూ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆ ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. -
అటు ఇటు మారి.. భువనగిరిలో చేరి..
[ 23-04-2024]
పార్లమెంట్ నియోజకవర్గాలు ఆవిర్భావమై దాదాపు ఏడు దశాబ్దాలు కాగా ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాలకు మారడం గమనార్హం. పునర్విభజన జరిగినప్పుడల్లా పార్లమెంటరీ నియోజకవర్గం మారింది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు ఇదే తేడా..
[ 23-04-2024]
ఎలక్టాన్రిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. -
లంచం కేసులో ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 23-04-2024]
లంచం కేసులో డబ్బులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) విచారణలో తేలడంతో మెదక్ గ్రామీణ ఎస్సై, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రజాచైతన్యంలో గ్రంథాలయాలు కీలకం
[ 23-04-2024]
ప్రజాచైతన్యానికి ఆ నాటి గ్రంథాలయాలు కీలకంగా పనిచేశాయని.. నిజాం నిరంకుశ పాలన, దొరల పెత్తనాన్ని మట్టుబెట్టేందుకు ఉపయోగపడ్డాయని ఆచార్య కోదండరామ్ అన్నారు. -
ఓటర్లకు చేరువ
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల సంఘం షెడ్యూలుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. -
పురపాలికల్లో పట్టు.. విజయానికి మెట్టు
[ 23-04-2024]
మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకొంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోకసభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. -
ఈసారి అవకాశం ఇవ్వండి
[ 23-04-2024]
భారాస అభ్యర్థి వినోద్కుమార్, భాజపా అభ్యర్థి బండి సంజయ్లను ఒక్కోసారి గెలిపించిన కరీంనగర్ లోక్సభ ఓటర్లు, ఈసారి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నామపత్రాలు దాఖలు చేసిన వెలిచాల రాజేందర్రావు కోరారు. -
విత్తనోత్పత్తికి అనుకూలం.. ప్రోత్సహించాల్సిన అవసరం
[ 23-04-2024]
వ్యవసాయంలో కీలకమైన విత్తనాలను కర్షకులు సేకరించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడి భూముల్లో విత్తితే చివరికి పంట ఎదుగుతుందో లేదోననే అనుమానం.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి